స్కూల్‌లో కొట్టుకున్న విద్యార్థులు

తమిళనాడు కోయంబత్తూర్ జిల్లాలో విషాదం నెలకొంది.

Last Updated : Jul 22, 2018, 02:18 PM IST
స్కూల్‌లో కొట్టుకున్న విద్యార్థులు

తమిళనాడు కోయంబత్తూర్ జిల్లాలో విషాదం నెలకొంది. కయత్తూరులోని ఫాతిమా మెట్రిక్యులేషన్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విదార్థులు ఈ నెల 16న లంచ్ టైంలో గొడవపడి పాఠశాల తరగతి గదిలోనే కొట్టుకున్నారు. ఆ సమయంలో తరగతి గదిలో క్లాస్ టీచర్ లేదు. కొందరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు.  ఈ క్రమంలో వడయార్ అనే విద్యార్థి మరో విద్యార్ధిని గాల్లోకి లేపి నేలకేసి కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు.  వీరిద్దరి మధ్య గొడవకు కారణాలు తెలియరాలేదు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ తరహాలో నేలకేసి కొట్టడంతో తోటి విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. భయంతో వడయార్ అక్కడి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రులు మిస్సింగ్ రిపోర్ట్ ఫైల్ చేయడంతో పోలీసులు ఆ బాలుడిని వెతికారు. అయితే అప్పటికే వడయార్ కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఇద్దరు విద్యార్థుల మృతి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. త్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు.

Trending News