గోడ విషయంలో గొడవ.. AK-47తో కాల్పుల కలకలం

ఇంటి దగ్గర తలెత్తిన చిన్న గొడవ ఏకే 47తో కాల్పులకు దారితీసింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Last Updated : Feb 7, 2020, 02:41 PM IST
గోడ విషయంలో గొడవ.. AK-47తో కాల్పుల కలకలం

సిద్దిపేట: ప్రహరి గోడ విషయంలో తలెత్తిన చిన్న వివాదం సిద్దిపేట జిల్లాలో కలకలం రేపింది. ఏకంగా ఏకే47తో కాల్పులు జరిపే వరకు తీసుకెళ్లింది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు చెందిన  దేవుని సదాంనందం, గుంటి గంగరాజు కుటుంబల మధ్య ప్రహరి గోడ విషయంలో వివాదం తలెత్తింది. మూడు రోజుల క్రితం గోడకు ఇటుకల విషయంలో వీరి మధ్య మాటామాటా పెరిగింది. ఇద్దరు వెనక్కి తగ్గకపోవడంతో గొడవ పెద్దదైంది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన సదానందం ఇంట్లోకి వెళ్లాడు.

Also Read: నిర్భయ దోషుల ఉరి వాయిదాపై దిశ తండ్రి సంచలన వ్యాఖ్యలు 

ఏకే-47 గన్‌తో ఒక్కసారిగా గంగరాజు ఇంట్లోకి వెళ్లి సదానందం కాల్పులు జరిపాడు. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గంగరాజు తెలివిగా వ్యవహరించడంతో బుల్లెట్లు ఆయనకు తాకలేదని తెలుస్తోంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏకే 47 గన్ ఎక్కడి నుంచి వచ్చిందో నని ఆరా తీస్తున్నారు. కాల్పులు జరిపిన సదానందం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సదానందం కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు.

Also Read: ‘దిశ చెల్లెలి విషయంలో జాగ్రత్త పడుతున్నాం’

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News