IPL 2020: పీపీఈ కిట్స్ లో యూఏఈకి రాజస్థాన్ టీమ్

రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ) టీమ్ సభ్యులు గురువారం రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయల్దేరనున్నారు.

Last Updated : Aug 23, 2020, 03:34 PM IST
    • రాజస్థాన్ రాయల్స్ టీమ్ సభ్యులు గురువారం రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయల్దేరనున్నారు.
    • సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపిఎల్ సీజన్ 13ను ఆడటానికి వారు దుబాయ్ బయల్దేరనున్నారు.
    • రాజస్థాన్ రాయల్స్ లోని రాబిన్ ఉతప్పా లాంటి సీనియర్ ఆటగాళ్లు పూర్తి సురక్షిత విధానంలో పీపిఈ కిట్లు ధరించి ప్రయాణం చేయనున్నారు.
IPL 2020: పీపీఈ కిట్స్ లో యూఏఈకి రాజస్థాన్ టీమ్

రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ) టీమ్ సభ్యులు గురువారం రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయల్దేరనున్నారు. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపిఎల్ సీజన్ 13ను ఆడటానికి వారు దుబాయ్ బయల్దేరనున్నారు. రాజస్థాన్ రాయల్స్ లోని రాబిన్ ఉతప్పా లాంటి సీనియర్ ఆటగాళ్లు పూర్తి సురక్షిత విధానంలో పీపిఈ కిట్లు ధరించి ప్రయాణం చేయనున్నారు.

భారత్ లో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణను గమనించి భారత క్రికెట్ కంటోల్ ( BCCI ) ఐపిఎల్ ను దుబాయ్ యూఏఈలో ( IPL 2020 UAE) లో నిర్వహించాలని నిర్ణయించింది. 

సెప్టెంబర్ 4 నుంచి ఇంగ్లాండ్-ఆసీస్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ మొదలు కానుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ కు చెందిన స్టీవ్ స్మిత్, బెన్ స్ట్రోక్, జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్ ను ఐపిఎల్ ( IPL ) అభిమానులు మిస్ అవనున్నారు. 

గత ఏడాది రాజస్థాన్ రాయల్స్ 7వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది కంగారు కెప్టెన్ స్టీవ్ స్మిత్ సారథ్యంలో రాణించగలరు అని ఆశిస్తున్నారు.  కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ సభ్యులు కూడా యూఏఈ ( UAE ) కి బయల్దేరనున్నట్టు ఫాస్ట్ బౌరల్ షమీ తెలిపారు.

మరిన్ని క్రికెట్ వార్తలు చదవండి

Trending News