Fight against COVID-19 కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారికి అవగాహన కల్పించేందుకు కృషిచేస్తోన్న జర్నలిస్టుల సేవలు మరవలేమని తెలంగాణ హైకోర్టు ( Telangana high court ) వ్యాఖ్యానించింది. కరోనావైరస్తో ( Coronavirus pandemic ) నిత్యం ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకుని వారికి అండగా నిలబడాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.
గత కొన్ని రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్ళీ పంజా విసురుతోంది. అయితే ఒకవైపు కరోనా కేసుల పెరుగుదల మరోవైపు లాక్ డౌన్ సడలింపులతో మరింత ఆందోళన కల్గిస్తోంది.
కరోనా వైద్య పరీక్షలు, చికిత్స కేవలం ప్రభుత్వాసుపత్రులు లేదా ప్రభుత్వం ల్యాబ్లలో మాత్రమే చేయించుకోవాలన్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఈ రోజు విచారణ చేసింది.
తెలంగాణ రాష్ట్ర సమితి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు విచారణ చేపట్టింది. జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లు కోర్టుకు తెలిపిన కేంద్ర హోంశాఖ, ఆ దేశ పాస్ పోర్టుతో మద్రాస్ నుండి జర్మనీ వెళ్లినట్టు కోర్టుకు కేంద్ర హోంశాఖ తెలిపింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం సాయంత్రం వరకు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయకూడదని ఎన్నికల కమిషన్ను న్యాయస్థానం ఆదేశించింది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, నేరాల సంఖ్య అధికమయ్యాయని ఫిర్యాదు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో జరిగే సకల నేరాలు అన్నింటికి కూడా కారణభూతమైన మద్యాన్ని కంట్రోల్ చేయకపోతే ఈ నేరాల్ని అదుపు చేయడం కూడా కష్టతరమవుతుందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
జాతీయ మానవహక్కుల సంఘం పంపించిన నిజ నిర్ధారణ కమిటి సభ్యులు చటాన్పల్లికి చేరుకుని ఎన్కౌంటర్ జరిగిన ఘటనాస్థలిని పరిశీలించారు. తొలుత మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన నిజ నిర్ధారణ కమిటి సభ్యుల బృందం.. ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను పరిశీలించింది.
షాద్నగర్కి సమీపంలోని చటాన్పల్లి కల్వర్టు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని మహబూబ్నగర్ జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
కమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్ వివాదాస్పదంగా ఉందని.. ఆ సినిమా టైటిల్ మార్చాలని కోర్టు ఆదేశించిన అనంతరం వర్మ తన సినిమాకు ''అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'' అని టైటిల్ మార్చుకున్నాడు.
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకులు తొలిగాయి. వార్డుల విభజన, ఓటర్ జాబితా సవరణపై గతంలో ఇచ్చిన తుది నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
టిఎస్ఆర్టీసీ సమ్మె(TSRTC Strike) ఆగలేదని.. సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉందని టిఎస్ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి(Ashwathama Reddy) అన్నారు. శనివారం హైదరాబాద్లో ఆర్టీసీ జేఏసీ(TSRTC JAC) నేతల సమావేశం జరిగింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశంపై ప్రభుత్వం విస్తృతస్థాయిలో చర్చ జరిపింది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకశంగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఆయన భారత పౌరసత్వానికి అనర్హుడని ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. చెన్నమనేని పౌరసత్వాన్ని సైతం రద్దు చేసింది.
ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమణకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ ఈ విజ్ఞప్తి చేశారు.
టిఎస్ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టిఎస్ఆర్టీసీ జేఏసి కన్వినర్ అశ్వథ్థామ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం కూడా హైకోర్టు తీర్పును గౌరవిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.