Telangana: తెలంగాణ రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది చోద్యం చూస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. సాక్షాత్తూ తెలంగాణ హైకోర్టు అభిప్రాయమిది.
Justice Hima Kohli Sworn As CJ Of Telangana High Court: తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీజే హిమా కోహ్లీతో గురువారం ప్రమాణం చేయించారు.
Non-agricultural properties | హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు సర్కార్ తెలిపింది.
Non-Agricultural properties registration | హైదరాబాద్: నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తిరిగి ఊపందుకోనుంది. తెలంగాణలో డిసెంబర్ 11వ తేదీ నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ని ఆదేశించినట్టుగా మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా తెలిపారు.
ఎంతో రసవత్తరంగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. చివరిసారి 2016 ఎన్నికలతో పోల్చుకుంటే.. ఏ పార్టీకి కూడా హైదరాబాద్ ప్రజలు స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టలేదు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ( Telangana State Election Commission) హైకోర్టు నుంచి షాక్ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి గురువారం అర్థరాత్రి జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు (High Court) ఆదేశాలిచ్చింది.
ఎన్నికల సమయంలో బాధితులకు సహాయం చేయకూడదా..ఇదే ఇప్పుడు హైాకోర్టులో చర్చనీయాంశమైన ప్రశ్న. డిసెంబర్ 4 తరువాతే వరద సహాయం అందించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పదమయ్యారు. దిశ ఎన్ కౌంటర్ చిత్రంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆర్జీవీకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లు వాయిదా పడనున్నాయి. హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపధ్యంలో నవంబర్ 23 నుంచి ప్రారంభం కావల్సిన ధరణి రిజిస్ట్రేషన్లు వాయిదా పడుతున్నాయి.
హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు అంతకంటే ముందుగా కరోనా పరీక్షలు చేయించుకుని.. నెగటివ్ అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే ప్రచారంలో పాల్గొనేలా చూడాలంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.
హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 నుంచి ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ భావించినప్పటికీ.. పలు సాంకేతిక కారణాల రీత్యా అది సాధ్యపడకపోవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన విధంగానే నవంబర్ 23 నుంచి ధరణి పోర్టల్పై వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్ ప్రారంభించడానికి అధికార యంత్రాంగం కూడా డిజిటలైజేషన్ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు , మాజీ టీడీపీ నేత సుజనా చౌదరికి చుక్కెదురైంది. అమెరికాకు బయలుదేరిన అతన్ని..ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. చేసేది లేక తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి తీవ్రరూపం దాలుస్తుండటంతో.. దీపావళి పర్వదినాన (deepavali 2020) టపాసులు కాల్చడంపై ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ (Telangana) లో కూడా దీపావళి టపాసులను (Firecrackers Ban) ఖచ్చితంగా నిషేధించాలని హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో ఇకపై కోర్టులు తెర్చుకోనున్నాయి. రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకూ పాటించాల్సిన అన్లాక్ విధి విదానాల్ని కోర్టు వెల్లడించింది.
తెలంగాణ మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వాస్తవ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే గతంలో ఈ చిత్రాన్ని ఆపాలంటూ.. హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత, ఆయన తండ్రి బాలస్వామి నల్లగొండ జిల్లా కోర్టులో సివిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Hearing on Agri Gold Case | అగ్రిగోల్డ్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ స్వీకరించనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ జస్టిస్ సీ రామచంద్ర రావు, జస్టిస్ కోడండరామ్ ముందు కేసు వివరాలను ప్రస్తావించారు
రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలనతోపాటు పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఇటీవల ధరణి పోర్టల్ (Dharani Portal) ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ధరణి పోర్టల్లో ఆస్తుల వివరాల నమోదుపై స్టే విధిస్తూ హైకోర్టు (Telangana High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.