Tamilisai Soundararajan News: గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అటెండర్ అనుమానాస్పద మృతి?

Tamilisai Soundararajan News: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అటెండర్ రాజ్ కుమార్ (47) అనుమానాస్పదంగా మృతి చెందారు. సికింద్రాబాద్ లోని స్కందగిరి దేవాలయంలో గవర్నర్ పూజలు నిర్వహిస్తున్న క్రమంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. అయితే అతను గుండెపోటు కారణంగా మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2022, 10:30 AM IST
Tamilisai Soundararajan News: గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అటెండర్ అనుమానాస్పద మృతి?

Tamilisai Soundararajan News: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అటెండర్ రాజ్ కుమార్ (47) మృతి చెందారు. నగరంలోని సికింద్రాబాద్ స్కందగిరి దేవాలయాన్ని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆ తర్వాత ప్రత్యేక పూజాలు నిర్వహించారు. 

ఇదే సమయంలో ఆమె వెంట ఉండే అటెండర్ రాజ్ కుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ వెంటనే హుటాహుటిన అతడ్ని స్థానిక గాంధీ ఆస్పత్రికి గవర్నర్ సెక్యూరిటీ తరలించారు. అయితే అటెండర్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. 

ఆస్పత్రికి తరలిస్తున్న మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. అటెండర్ రాజ్ కుమార్ మృతదేహాన్ని రాజ్ భవన్ కు తరలించారు. ఆయన మృతి పట్ల గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సంతాపాన్ని తెలియజేశారు.  

Also Read: Telangana Weather: తెలంగాణలో 5 డిగ్రీల మేర తగ్గనున్న పగటి ఉష్ణోగ్రతలు... మరో 4 రోజులు వర్షాలే...!

Also Read: Robbers Arrested: ఘరానా దొంగల అరెస్ట్.. భారీగా ద్విచక్ర వాహనాలు, ల్యాప్ టాప్‌లు స్వాధీనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x