TS High Court: అగ్రీగోల్డ్ కేసు విచారణను స్వీకరించిన తెలంగాణ హైకోర్టు

Hearing on Agri Gold Case | అగ్రిగోల్డ్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ స్వీకరించనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ జస్టిస్ సీ రామచంద్ర రావు, జస్టిస్ కోడండరామ్ ముందు కేసు వివరాలను ప్రస్తావించారు

Last Updated : Nov 4, 2020, 05:50 PM IST
    • అగ్రిగోల్డ్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ స్వీకరించనుంది.
    • ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ జస్టిస్ సీ రామచంద్ర రావు, జస్టిస్ కోడండరామ్ ముందు కేసు వివరాలను ప్రస్తావించారు.
    • అదే సమయంలో పిటిషనర్ తరపు అడ్వకేట్ శ్రవణ్ కుమార్ కూడా తన వాదనను బెంచ్ ముందు వినిపించాడు.
TS High Court: అగ్రీగోల్డ్ కేసు విచారణను స్వీకరించిన తెలంగాణ హైకోర్టు

Agri Gold Case | అగ్రిగోల్డ్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ స్వీకరించనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ జస్టిస్ సీ రామచంద్ర రావు, జస్టిస్ కోడండరామ్ ముందు కేసు వివరాలను ప్రస్తావించారు. అదే సమయంలో పిటిషనర్ తరపు అడ్వకేట్ శ్రవణ్ కుమార్ కూడా తన వాదనను బెంచ్ ముందు వినిపించాడు. 

Also Read | AP Board of Intermediate: విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

ఈ మేరకు సోమవారం ఈ కేసుపై రెగ్యులర్ హియరింగ్ జరపడానికి న్యాయమూర్తులు అంగీకరించారు. రీపేమెంట్ కోసం అగ్రిగోల్డ్ ( Agri Gold ) బాధితుల దరఖాస్తుల్లో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ఏపి అడ్వొకేట్ జనరల్ శ్రీ రామ్ కోర్టును కోరారు. 

తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో అగ్రీగోల్డ్ ఆస్తులు వేలం వేయాల్సిందిగా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన తెలంగాణ హైకోర్టు ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ ముందుంచుతాం అని తెలిపింది. హైకోర్టు నిలిపివేసిన అగ్రిగోల్డ్ నిధులను పంచాల్సిందిగా పిటిషనర్ల తరపు న్యాయవాది అయిన శ్రవణ్ కుమార్ కోర్టును కోరారు.

Also Read | Acharya: నవంబర్ 9 నుంచి ఆచార్య షూట్... 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News