Medak Road accident: లారీని ఢీకొన్న బైక్.. ముగ్గురు అన్నదమ్ముల మృతి

Medak Road accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2021, 02:41 PM IST
  • మెదక్ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం
  • లారీని ఢీకొన్న బైక్
  • ముగ్గురు అన్నదమ్ములు మృతి
Medak Road accident: లారీని ఢీకొన్న బైక్.. ముగ్గురు అన్నదమ్ముల మృతి

Medak Road accident : తెలంగాణ మెదక్ జిల్లా(Medak District)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం(Road accident)లో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన చేగుంట సమీపంలో జరిగింది. ఉల్లి తిమ్మాయపల్లికి చెందిన రాకేశ్‌ (17), ప్రదీప్‌ (15), అరవింద్‌ (14) అన్నదమ్ములు.  ఇవాళ ఉదయం రాకేశ్‌ తన తమ్ముళ్లిద్దరినీ ద్విచక్ర వాహనంపై పాఠశాలకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో చేగుంట సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనం(Bike) అదుపుతప్పి లారీ(Lorry)ని ఢీ కొట్టింది. రాకేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. 

.తీవ్ర గాయాలపాలైన ప్రదీప్‌, అరవింద్‌ స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సుభాష్‌ గౌడ్‌ వెల్లడించారు.

Also Read: Kamareddy Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు దుర్మరణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News