'కరోనా వైరస్'పై ఉపాసన కామినేని ట్వీట్

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను గజ గజా వణికిస్తున్న 'కరోనా వైరస్' తెలంగాణలోనూ ప్రవేశించడంతో కలకలం రేగుతోంది. హైదరాబాద్‌లో నమోదైన తొలి పాజిటివ్ కేసు గుబులు పుట్టిస్తోంది. 

Last Updated : Mar 3, 2020, 01:15 PM IST
'కరోనా వైరస్'పై ఉపాసన కామినేని ట్వీట్

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను గజ గజా వణికిస్తున్న 'కరోనా వైరస్' తెలంగాణలోనూ ప్రవేశించడంతో కలకలం రేగుతోంది. హైదరాబాద్‌లో నమోదైన తొలి పాజిటివ్ కేసు గుబులు పుట్టిస్తోంది. ఐతే దీని వల్ల భయపడాల్సి ఏమీ లేదని.. చికిత్సలు అందుబాటులో ఉన్నాయని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని ట్వీట్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో రోగికి మంచి చికిత్స లభిస్తోందని తెలిపారు. ఆయన్ను మిగతా రోగులకు దూరంగా ఉంచి చికిత్స అందిస్తున్నారని వివరించారు. ఐతే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. ఎవరికి వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజల బాధ్యతే అతి ముఖ్యమని అన్నారు. జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే .. వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.  

Read Also: కరోనా ఎఫెక్ట్: కొత్త తరహా పలకరింపు

'కరోనా వైరస్' రాకుండా జాగ్రత్తలు సూచిస్తూ ఆమె ఓ వీడియోను కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు.

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News