Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల మోత.. రూ.20 వేలు విలువ చేసే ఎల్‌ఈడీ టీవీ కేవలం రూ.2899కే..

Flipkart Electronics Sale: ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్ సేల్‌లో స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.20 వేలు విలువ చేసే మార్క్యూ ఎల్‌ఈడీ టీవీ అతి చౌకగా రూ.2899కే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Jun 25, 2022, 02:58 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్ సేల్
  • జూన్ 23 నుంచి జూన్ 27 వరకు ఎలక్ట్రానిక్ సేల్ ఆఫర్
  • అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు, ఎక్స్‌చేంజ్ ఆఫర్
Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల మోత.. రూ.20 వేలు విలువ చేసే ఎల్‌ఈడీ టీవీ కేవలం రూ.2899కే..

Flipkart Electronics Sale: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌‌‌లో ఆఫర్ల మోత మోగుతోంది. ఎలక్ట్రానిక్ సేల్ పేరిట ఫ్లిప్‌కార్ట్ అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులు అతి చౌక ధరకే అందుబాటులో ఉన్నాయి. పలు బ్రాండ్స్‌పై డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉండటంతో సగం కన్నా తక్కువ ధరకే మీరు కోరుకున్న బ్రాండ్స్‌ని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్‌లో భాగంగా రూ.20 వేలు విలువ చేసే మార్క్యూ (32 అంగుళాలు) ఎల్‌ఈడీ టీవీని కేవలం రూ.2899కే కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ మార్కెట్లోకి లాంచ్ అయ్యాక ఇంతకన్నా డెడ్ చీప్‌గా మరెక్కడా అందుబాటులో లేదు.

ఎలక్ట్రానిక్ సేల్.. 60 శాతం డిస్కౌంట్ ఆఫర్ :

మార్క్యూ (32 అంగుళాలు) ఎల్‌ఈడీ టీవీ సాధారణ ధర రూ.19,999. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌లో 60 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. అంటే.. ఈ ఆఫర్ ద్వారా రూ.12 వేలు ఆదా అవుతుంది. డిస్కౌంట్ పోను కేవలం రూ.7,999కే ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, ఈ టీవీ కొనుగోలుకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడినట్లయితే మరో రూ.1250 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. అప్పుడు ఈ ఎల్‌ఈడీ టీవీని మరింత చౌకగా.. రూ.6749కే పొందవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో డెడ్ చీప్ ధరకే.. :

 మార్క్యూ (32 అంగుళాలు) ఎల్‌ఈడీ టీవీపై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందిస్తోంది. మీ పాత టీవీని ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్లయితే దాని కండిషన్‌ని బట్టి రూ.5100 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ పూర్తిగా వర్తించినట్లయితే రూ.7999కి అందుబాటులో ఉన్న ఈ టీవీని డెడ్ చీప్‌గా రూ.2899కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కు షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. ఈ లిమిటెడ్ ఆఫర్ జూన్ 27తో ముగియనుంది. 

Also Read: Rashmika Mandanna Responds : కుక్కకి టికెట్ల వార్తపై రష్మిక స్పందన

Also Read: Flipkart Electronics Sale: ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. రూ.11 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం రూ.749కే  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News