Anchor Vishnu Priya: స్టేజ్ మీదే గుక్కపట్టి ఏడ్చిన విష్ణు ప్రియ.. అందరినీ ఏడిపించేసిందిగా!

Anchor Vishnu Priya Cries on Stage: హృదయాలను కదిలించే విధంగా ఉన్న మదర్స్ డే స్పెషల్ స్కిట్ చూసిన విష్ణు ప్రియ వెంటనే కన్నీరు మున్నీరయి, స్టేజ్ మీదకు వచ్చి మరీ ఆమె బోరున విలపిస్తూ తన తల్లిని గుర్తు చేసుకుంది.

Written by - Chaganti Bhargav | Last Updated : May 9, 2023, 10:35 PM IST
Anchor Vishnu Priya: స్టేజ్ మీదే గుక్కపట్టి ఏడ్చిన విష్ణు ప్రియ.. అందరినీ ఏడిపించేసిందిగా!

Anchor Vishnu Priya Cries on Stage for Her Mother: తెలుగులో ఉన్న అతి కొద్ది మంది హాట్ యాంకర్స్ లో విష్ణుప్రియ కూడా ఒకరు. మొదట్లో పలు సినిమాలలో షార్ట్ ఫిలిమ్స్ లో ప్రయత్నాలు చేసిన ఈ భామ ఎందుకో అనుకోకుండా యాంకర్ గా సెట్ అయింది. తాను చదువుకునే రోజుల్లో పాకెట్ మనీ కోసం భగవద్గీత క్లాసులు కూడా ఈమె పిల్లలకి బోధించేదట. అలా చాలా చాలా పద్ధతిగా పెరుగుతూ వచ్చిన ఈ భామ అనుకోని విధంగా టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టి హాట్ యాంకర్ గా రూపాంతరం చెందింది.

నిజానికి పోవే పోరా అనే షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ షో తో పాపులర్ అయిన తర్వాత అనేక రకాల షోస్ లో కూడా పాల్గొని అలరించింది. అయినా ఆ షో ఇచ్చినంత క్రేజ్ ఆమెకు మరే షో ఇవ్వలేదు.  ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ ఫేమ్ మానస్ తో కలిసి యూట్యూబ్ లో సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ మంచి క్రేజ్ అయితే దక్కించుకుంటుంది.

అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్న ఈ భామ ఆధ్యాత్మిక చింతనలో కూడా మునిగితేలుతోంది. తాజాగా ఈ బ్యూటీ మల్లెమాల సంస్థ చేసిన ఒక స్పెషల్ టీవీ ఈవెంట్ లో పాల్గొంది. మదర్స్ డే స్పెషల్గా ఈటీవీ నిర్వహించిన ప్రియమైన అమ్మకు అనే ఒక స్పెషల్ ఎపిసోడ్లో జబర్దస్త్ కమెడియన్ లో పేరెంట్స్ అందరూ వచ్చారు. ఈ ఈవెంట్ కి హాజరైన విష్ణు ప్రియ మీద హైపర్ ఆది వేసిన జోకులు కూడా అందరిని నవ్వించాయి.

Also Read: Akhil Akkineni Next Movie: అఖిల్ కోసం రంగంలోకి ప్రభాస్.. భారీ బడ్జెట్ మూవీ ఫిక్స్?

ఒక మాటలో చెప్పాలంటే ఈ టీవీతో పాటు మల్లెమాల సంస్థతో అనుబంధం ఉన్న ఆర్టిస్టులు, యాంకర్లు వంటి వారు ఇందులో పాల్గొన్నారు. ఆర్టిస్టులంతా కలిసి కామెడీ స్కిట్లతో అలరించారు. ఇక ఈ క్రమంలో నూకరాజు, రాకింగ్ రాకేష్ కలిసి చేసిన మదర్స్ డే స్పెషల్ స్కిట్ అందరినీ ఆకట్టుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక తల్లిని ఇద్దరు కొడుకులు నిర్లక్ష్యం చేయడంతో ఆమె కన్నుమూస్తుంది, అయితే చనిపోయిన తర్వాత అమ్మ అంటూ వాళ్ళిద్దరూ ఏడుస్తున్న తీరు అందరి చేత నీళ్లు పెట్టించింది.

హృదయాలను కదిలించే విధంగా ఉన్న ఈ స్కిట్ చూసిన విష్ణు ప్రియ వెంటనే కన్నీరు మున్నీరయింది. స్టేజ్ మీదకు వచ్చి మరీ ఆమె బోరున విలపిస్తూ తన తల్లిని గుర్తు చేసుకుంది. తన తల్లిని గుర్తు చేసుకుంటూ అల్లాడిపోయిన విష్ణు ప్రియని చూసి మిగిలిన వాళ్ళంతా కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దెబ్బతో షో అంతా కన్నీళ్ళతో నిండిపోయి అందరి మనసులు బరువెక్కిపోయాయి.

ఇక ఈ సందర్భంగా విష్ణు ప్రియ తన తల్లిని తలుచుకుంటూ మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపున పుడతా ఐ లవ్ యు సారీ అమ్మ ఐ లవ్ యు అంటూ ఏడుస్తున్న తీరు అక్కడున్న అందరినీ కదిలించివేసింది. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక ప్రోమో అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మరోపక్క ఈ షోలో అలనాటి అందాల తార రాశి కూడా పాల్గొనడంతో ఆమె షో మొత్తానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇక విష్ణుప్రియ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో పాటు వీడియోలను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూసేయండి.

Also Read: Custody Censor Report: కస్టడీ సెన్సార్ రిపోర్టు బయటకు.. అందరి నమ్మకం అదేనట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News