Sankranthi Movies 2025: చిరంజీవికి వెంకటేష్, రవితేజ బాక్సాఫీస్ సవాల్.. సంక్రాంతి బరిలో రసవత్తర పోరు..

Sankranthi Movies 2025: తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు సంక్రాంతి అతిపెద్ద సీజన్. అందుకే ఈ పండగ సీజన్‌లో తమ సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి 'విశ్వంభర' సంక్రాంతి బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు. తాజాగా వెంకటేష్, రవితేజ ఇద్దరు కూడా తమ సినిమాలను సంక్రాంతి  పండక్కి వస్తున్నట్టు ప్రకటించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 10, 2024, 10:34 AM IST
Sankranthi Movies 2025: చిరంజీవికి వెంకటేష్, రవితేజ బాక్సాఫీస్ సవాల్.. సంక్రాంతి బరిలో రసవత్తర పోరు..

Sankranthi Movies 2025: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి అతిపెద్ద సీజన్ సంక్రాంతి. ఈ సీజన్‌లో నాలుగైదు చిత్రాలు వచ్చినా.. ప్రేక్షకులు ఆదరించిన దాఖలాలలున్నాయి. ఒకేసారి విడుదలైన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టైయిన సందర్భాలున్నాయి. 2024 సంక్రాంతి బరిలో మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల 'గుంటూరు కారం' మూవీతో పాటు ప్రశాంత్ వర్మ 'హనుమాన్' తో పాటు వెంకటేష్ 'సైంధవ్', నాగార్జున హీరోగా నటించిన ' నా సామి రంగ' సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. నాగార్జున హీరోగా నటించిన 'నా సామి రంగ' ఓ మోస్తరు విజయం సాధించింది. గుంటూరు కారం సినిమా పర్వాలేదనపించే స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇక సైంధవ్ సినిమా మాత్రమే బాక్సాఫీస్ దగ్గర అడ్రస్ లేకుండా పోయింది.

ఆ సంగతి పక్కన పెడితే.. 2025 సంక్రాంతి బరిలో ముందుగానే చిరంజీవి.. వశిష్ఠ దర్శకత్వంలో చేస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' మూవీని జనవరి 10న విడుదల చేస్తున్నట్టు అందరి కంటే ముందుగానే అనౌన్స్ చేశారు.  యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి సినిమాల తర్వాత వస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ కావడం గమనార్హం. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలు మాత్రమే హిట్ అనిపించుకున్నాయి. కానీ సాలిడ్ ప్యాన్ ఇండియా రేంజ్ హిట్ మాత్రం దక్కలేదు. ఇపుడు వశిష్ఠతో చేస్తోన్న సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్‌లో హిట్ అందుకోవాలనే కసి మీదున్నారు చిరంజీవి. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష యాక్ట్ చేస్తోంది.

ఆ సంగతి పక్కన పెడితే.. 2025 సంక్రాంతి బరిలో రవితేజ తన 75వ చిత్రంతో పలకరించబోతున్నట్టు ఉగాది కానుకగా అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతోంది. సంక్రాంతి బరిలో ఏ తేదిన అనేది మాత్రం  ప్రకటించలేదు.

మరోవైపు చిరంజీవి సీనియర్ తోటి హీరో వెంకటేష్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తోన్న సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ  సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాబట్టి సంక్రాంతి బరిలో థియేటర్స్ సమస్య ఉండదు. పైగా ఈ సినిమాను అనిల్ రావిపూడి కామెడీ కమ్ క్రైమ్ ఎంటర్టైన్మెంట్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ఇద్దరు భార్యల మధ్య నలిగే సీనియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. ఇద్దరు భార్యల స్టోరీకి క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాన తెరకెక్కిస్తున్నారు. మొత్తంగా సంక్రాంతి బరిలో సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్‌లతో పాటు రవితేజలు పోటీ పడుతున్నారు. మరి ఇపుడు చెబుతున్నట్టే ఈ సినిమాలు సంక్రాంతి బరిలో నిలుస్తాయా ? లేకపోతే వేరే రిలీజ్ డేట్స్ లాక్ చేసుకుంటాయా అనేది చూడాలి.

Also Read: Pawan Chiranjeevi Meet: పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి ఆశీర్వాదం.. రూ.5 కోట్ల విరాళంతో భరోసా ఇచ్చిన 'అన్నయ్య'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News