చెన్నైలో 11ఏళ్ల బాలికపై అత్యాచారం

చెన్నైలో దారుణం జరిగింది.

Last Updated : Jul 17, 2018, 01:20 PM IST
చెన్నైలో 11ఏళ్ల బాలికపై అత్యాచారం

చెన్నైలో దారుణం జరిగింది. 11 ఏళ్ల బాలికను అపార్ట్మెంట్ బిల్డింగ్‌లో 22 మంది ఏడు నెలలుగా అత్యాచారం చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. బాలిక తనపై లైంగిక దాడికి పాల్పడ్డ వారిలో 17 మందికి గుర్తించగా.. పోలీసులు వాళ్లని అరెస్టు చేశారు. వీరిలో బిల్డింగ్ సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీళ్లు బాలికను చంపుతామని బెదిరించారని, శీతలపానీయాల్లో మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారిలో లిఫ్ట్ ఆపరేటర్, వాటర్ సప్లయర్, ఎలక్ట్రీషియన్ లాంటి వారున్నారని   పోలీసులు తెలిపారు. ఆ బాలిక జరిగిన దుశ్చర్య గురించి అక్కకు చెప్పగా.. తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు.

Trending News