మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆరు రాష్ట్రాల్లో పిడుగులు

మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆరు రాష్ట్రాల్లో పిడుగులు

Last Updated : Aug 31, 2019, 09:27 AM IST
మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆరు రాష్ట్రాల్లో పిడుగులు

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రాజస్థాన్, విదర్భ, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవుల్లోనూ నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బీహార్, జార్ఖండ్, సిక్కిం, ఒడిశా, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు కూడా పడవచ్చని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

గోవాలోని ఉత్తర గోవా, దక్షిణ గోవా జిల్లాల్లోనూ నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Trending News