గ్రామాల పురోభివృద్ధికై e-Gram Swaraj, Swamitva yojanaలను ప్రారంభించిన ప్రధాని మోదీ..

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్బంగా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించుటకై ప్రధానమంత్రి మోదీ ఈ రోజు 'స్వామిత్వ యోజన' పథకాన్ని ప్రకటించారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించిన

Last Updated : Apr 24, 2020, 06:54 PM IST
గ్రామాల పురోభివృద్ధికై e-Gram Swaraj, Swamitva yojanaలను ప్రారంభించిన ప్రధాని మోదీ..

న్యూఢిల్లీ: జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్బంగా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించుటకై ప్రధానమంత్రి మోదీ ఈ రోజు 'స్వామిత్వ యోజన'(Swamitva yojana)పథకాన్ని ప్రకటించారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించిన ప్రధాని దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ చాలా గ్రామాల్లో నిరంతరం గొడవలు జరుగుతున్నాయని, ఈ గొడవలకు కారణం సరైన ఆధారాలు లేకపోవడమే కారణమని ప్రధాని అన్నారు. ఇకపై అలాంటి వాటికి చోటుండదని, దేశంలోని ప్రతి గ్రామంలో భూమిని మ్యాపింగ్ చేయడం జరుగుతుందని అప్పుడు భూమి యజమానికి యాజమాన్యం యొక్క ధృవీకరణ పత్రం ఇవ్వబడుతుందని అన్నారు.

Also Read: సచిన్... ది గ్రేట్ బౌలర్.. హీరోగా నిలిపిన ప్రదర్శనలివే

ఇంతకుముందు గ్రామంలోని భూమిపై బ్యాంకు రుణం అమలు పారదర్శకంగా జరగడం లేదని, ఈ పథకం అమలులోకి వస్తే ప్రజలు తమ ఆస్తిపై రుణాలు పొందే అవకాశం ఈ పథకం ముఖ్య ఉద్ద్యేష్యం అన్నారు. అంతేకాకుండా ఈ పథకం గ్రామాల సామాజిక జీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని, వ్యవసాయం రుణాలతో ఉపాధిని ప్రారంభించడానికి సహాయపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. అయితే, దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, కర్ణాటకతో సహా ఆరు రాష్ట్రాల్లో ప్రారంభిస్తున్నామని, ఈ పథకం లాభ, నష్టాలను అధ్యయనం చేసి ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

 చైనాలో తగ్గుతున్న కరోనా కేసులు..!!

అదే క్రమంలో దేశవ్యాప్తంగా గ్రామ స్థాయిలో అవినీతిని నిర్మూలించడానికి అభివృద్ధి ప్రక్రియలో పారదర్శకతను తీసుకొచ్చే ఉద్దేశ్యంతో ఇ-గ్రామ్ స్వరాజ్(e-Gram Swaraj) పోర్టల్ అప్లికేషన్ ను ప్రారంభించారు. ఈ యాప్, పోర్టల్ సహాయంతో గ్రామ స్థాయిలో అన్నీ రకాల సేవలు సులభతరంగా వినియోగించుకోవచ్చని అన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News