పాటలకు ఇక గుడ్ బై: జానకి

Last Updated : Oct 29, 2017, 03:08 PM IST
పాటలకు ఇక గుడ్ బై: జానకి

గానకోకిల ఎస్.జానకి ఇక పాటలు పాడరు.  ఆమె గతకొంతకాలంగా వేదికలపై పాటల్ని పాడటం మానేశారు. ఒక సంస్థకు విరాళాలు అందించేందుకు చివరిసారిగా మైసూరు వేదికపై పాడి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినచోటే ముగింపు పలికారు గాయని ఎస్‌.జానకి. దివంగత గాయకుడు పి.బి.శ్రీనివాస్ తో కలిసి జానకి 1952లో ఇక్కడి నుంచే పాటలు ఆలపించారు. ఆమె సెప్టెంబర్ 2016న తాను పాటలు ఆపేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.  

వేదికల మీద పాడటాన్ని నిలిపివేసిన గాయని జానకి, ఆమె వీరాభిమానుల విన్నపం మేరకు ఒక స్వచ్ఛంద సంస్థకు సహాయాన్ని అందించేందుకు చివరిసారిగా మైసూరులో శనివారం రాత్రి జరిగిన సంగీత విభావరిలో పాల్గొన్నారు. మైసూరులోనే ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. మైసూరులోనే ప్రస్థానానికి ముగింపు పలకడం ద్వారా ఈ పట్టణంపై ఆమె మమకారాన్ని, కృతజ్ఞతను చాటుకున్నారు. ఆమె పాటలను ప్రత్యక్షంగా వినేందుకు నగరం నలుమూలల నుంచి చాలా మంది సంగీతాభిమానులు  తరలివచ్చారు. ఈ సందర్భంగా మైసూరు ఒడయరు రాజవంశస్థులు, అలనాటి గాయకులు, రాజకీయనాయకులు ఆమెను ఘనంగా సత్కరించారు.

Trending News