Cricket: క్రికెట్ లవర్స్‌కు ఇక పండగే

ఐసీసీ ( ICC ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపధ్యంలో నిరాశకు గురవుతున్న క్రికెట్ అభిమానులకు ( Cricket lovers ) ఇది నిజంగా గుడ్‌న్యూస్. ఇక వరుసగా మూడేళ్లపాటు అభిమానులు పండగ చేసుకోనున్నారు. ఇంతకీ ఆ నిర్ణయమేంటో తెలుసా..

Last Updated : Jul 21, 2020, 12:23 PM IST
Cricket: క్రికెట్ లవర్స్‌కు ఇక పండగే

ఐసీసీ ( ICC ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపధ్యంలో నిరాశకు గురవుతున్న క్రికెట్ అభిమానులకు ( Cricket lovers ) ఇది నిజంగా గుడ్‌న్యూస్. ఇక వరుసగా మూడేళ్లపాటు అభిమానులు పండగ చేసుకోనున్నారు. ఇంతకీ ఆ నిర్ణయమేంటో తెలుసా..

ఐసీసీ ( International Cricket Council ) సోమవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీ20 వరల్డ్‌కప్ ( T20 world cup ) తో సహా పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలతో క్రికెట్ లవర్స్ ఇక పండగ చేసుకోనున్నారు. ఈ ఏడాది జరగాల్సిన ప్రపంచ‌కప్ ( World cup ) ను వచ్చే యేడాదికి వాయిదా వేసింది ఐసీసీ. దాంతో వరుసగా మూడేళ్లపాటు మూడు ప్రపంచ‌కప్ ఫార్మాట్ ( Three world cup formats ) లు జరగనున్నాయి. ఇందులో రెండు టీ20 వరల్డ్‌కప్ లు కాగా మూడోది వన్డే ప్రపంచ‌కప్ గా ఉంది. Also read: ICC T20 World Cup 2020: ఐసిసి టీ20 వరల్డ్ కప్‌ వాయిదా

కరోనా మహమ్మారి ( Corona pandemic ) కారణంగా టీ20 ప్రపంచ‌కప్ వాయిదా పడింది. దాంతో ఐపీఎల్ ( IPL ) కు మార్గం సుగమమైంది. టీ20 వరల్డ్‌కప్ ను ఐసీసీ వాయిదా వేయడంతో ఐపీఎల్ కోసం బీసీసీఐ ( BCCI ) ప్రణాళిక రచిస్తోంది. వచ్చే ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్య కాలంలో టీ20 వరల్డ్‌కప్ జరగవచ్చు. ఐసీసీ తీసుకున్న నిర్ణయంతో వరుసగా మూడేళ్ల పాటు మూడు ప్రపంచ‌కప్ ( Three years Three World cups ) లు జరగనున్నాయి. 2021, 2022లలో టీ20 వరల్డ్‌కప్ లకు భారతదేశం ( India ) , ఆస్ట్రేలియా ( Australia ) లు మార్చుకునే అవకాశాలున్నట్టు ఐసీసీ తెలిపింది. మరోవైపు 2023లో ఎలాగూ వన్డే ప్రపంచ‌కప్ జరగాల్సి ఉంది. వరుసగా మూడేళ్ల పాటు మూడు ప్రపంచ‌కప్ లు జరగనుండటంతో వేదికలపైనే సందిగ్దత నెలకొననుంది. Also read: ENG vs WI: మ్యాచ్ ఆపి.. బంతిని శానిటైజ్ చేసిన అంపైర్

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x