పార్లమెంట్ నూతన భవనానికి ( New Parliament Building ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం 12.50 నిమిషాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రధాని మోదీ పునాది రాయి వేశారు.
పార్లమెంట్ నూతన భవనం (new parliament building) శంకుస్థాపనకు ముహూర్తం ఖారారైంది. ఈ నూతన సౌధం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) ఈ నెల 10న భూమిపూజ చేయనున్నారు.
పార్లమెంట్ చరిత్రలో ప్రస్తుత వర్షకాల సమావేశాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు.. సభ్యులందరూ 3రోజుల ముందుగానే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. దీంతోపాటు ఈ సెషన్కు సెలవులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
భారత్లో కరోనావైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 14 నుంచి అక్టోబరు 1 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. అయితే కరోనావైరస్ కారణంగా ఈ సారి సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లతోపాటు.. సభ్యులకు పలు షరతులు కూడా విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు ఉభయసభల అధికారులు.
దేశవ్యాప్తంగా కరోనా ( Coronavirus) వినాశనం కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిదులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కరోనా బారిన పడి కన్నుమూశారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు (parliament for monsoon session) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.