అమరావతి భూ కుంభకోణం కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి నెలాఖరుకు వాయిదా వేసింది.
ఏపీలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం మరో వినూత్న పథకం ప్రారంభమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.
అన్నదాతలకు ఉచిత విద్యుత్ కోసం మెగా సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం కానుంది. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టు పూర్తయితే..30 ఏళ్ల వరకూ రైతులకు ఉచితంగా విద్యుత్ అందుతుంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు తృటిలో ప్రమాదం తప్పింది. కారు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో కారు బోల్తా పడకుండా కంట్రోలైనట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరం ఇకపై అభివృద్ధికి నోచుకోనుంది. రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లకు ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. మరో నాలుగు త్వరలో ప్రారంభం కానున్నాయి.
పవిత్ర తుంగభద్ర నదీ పుష్కరాలు రేపు ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ పుష్కరాలు..నదీ స్నానాల్లేకుండానే జరగనుండటం విశేషం.
రాష్ట్రంలో విద్య, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్న వైెఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త వైద్య కళాశాలల పనులు ఊపందుకున్నాయి. అటు గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నిర్మాణం కూడా జరుగుతోంది.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ల స్థలాల పంపిణీకు మొదట్నించీ అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. హైకోర్టు స్టేల కారణంగా పలుసార్లు వాయిదా పడింది. ఇక ఆ కార్యక్రమం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరిపై అదికార పార్టీ విమర్శలు ఎక్కు పెడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై నిమ్మగడ్డకు అంత తొందరెందుకని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీలం సాహ్ని ఈ మేరకు ఎన్నికల కమీషన్ కు లేఖ రాశారు.
అత్యంత పవిత్రమైన తుంగభద్ర నది పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారు. నవంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే పుష్కరాల్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఖరారైంది.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్ని కల పంచాయితీ ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆలోచనలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తుండటం వివాదానికి దారి తీస్తోంది. మంత్రి కొడాలి నాని నిమ్మగడ్డపై మరోసారి విరుచుకుపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గుతోందంటూ వస్తున్న ఆరోపణలపై ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని స్పష్టం చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి ప్రశంసలు కురిపించారు. మెట్ట ప్రాంతాల రైతు సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన అపర భగీరథుడిగా జగన్ను కొనియాడారు.
ఏపీ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. రైతుల ప్రయోజనాల కోసం వినూత్న పథకాల్ని ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో పథకాన్ని ప్రారంభించారు ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్.
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ చేస్తున్న కసరత్తు దాదాపు పూర్తయి వచ్చింది. ఇంతకీ ఎన్ని జిల్లాలు ఏర్పడుతున్నాయి ? 32 కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయా ?
వేసవి వచ్చిందంటే చాలు..విశాఖపట్నంలో తాగునీటి కోసం కటకటలాడే పరిస్థితి. ప్రతిపాదిత రాజధాని ప్రాంతం కావడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గోదావరి నీటిని విశాఖకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. పోలవరం, వెలిగొండ, అవుకు టన్నెల్ -2 పనుల్ని ఆలస్యం లేకుండా..త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో కరోనా వైరస్ దాదాపు తగ్గిపోయినట్టే కన్పిస్తోంది. భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండటంతో వైరస్ తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కేవలం 1732 కొత్త కేసులు మాత్రమే వెలుగు చూశాయి.
ఆరోగ్య శ్రీ పథకాన్ని ఇకపై పూర్తిగా..సంపూర్ణంగా అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ లను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చాలని ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.