Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.
Maharashtra govt cuts 5 percent muslim quota: గత కొన్ని రోజులుగా ముస్లిం రిజర్వేషన్ లపై కోర్టులో పలు పిటిషన్ లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో దీనిపై తాజాగా.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రంజాన్ పండగ నేపథ్యంలో అపోసిషన్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.
Musical Road: భారతదేశంలో తొలి మ్యూజికల్ రోడ్డు ప్రారంభమైంది. ముంబై కోస్టల్ రోడ్డులోని నారిమన్ పాయింట్ నుంచి వర్లి వైపు వెళ్లే నార్త్బౌండ్ లేన్లో 500 మీటర్ల మేర మ్యూజికల్ రోడ్డును ఏర్పాటు చేశారు. దీన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధికారికంగా ప్రారంభించారు.
BMC Elections:మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరగగా 25 చోట్ల బీజేపీ సారథ్యంలోని మహాయుతి గెలుపొందింది. థాక్రే కుటుంబానికి కంచుకోట లాంటి ముంబయి నగరాన్నీ మహాయుతి కైవసం చేసుకుంది.
Inaugurated Of Patanjali Asias Largest Orange Processing Plant In Nagapur: రైతులకు ఊపిరి పోసేలా పతంజలి సంస్థ ఆసియాలోనే అతిపెద్ద నారింజ పండు ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించింది. అట్టహాసంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
Devendra Fadnaviss: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ఈమధ్య ఘనంగా జరిగిన జి రియల్ హీరోస్ అవార్డ్స్ ఫంక్షన్ కి.. హాజరయ్యారు. 2024 సంవత్సరానికి గాను.. జీ వారు రియల్ హీరో అవార్డ్స్ అందజేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వివరాలు ఎన్నో సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారాయి.
Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఏకంగా ఆయన పేషీకి బెదరింపు కాల్స్ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా పవన్ ను బెదిరించిన ఆగంతకుడిని పోలీసులు పట్టుకున్నారు.
Maharashtra CM Devendra Fadnavis: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై శివసేన అధినేత ఏక్ నాథ్ షిండే పట్టువీడకపోవడం.. మరోవైపు బీజేపీ పెద్దలు మాత్రం ఎక్కువ సీట్లు వచ్చిన తమకే సీఎం పదవి తీసుకుంటామని చెప్పారు. చివరకు అంతా అనుకున్నట్టే మహాయుతి తరుపున దేవేంద్ర ఫడణవీస్ కు మహారాష్ట్ర సీఎం పదవి దగ్గబోతున్నట్టు దాదాపు ఖరారైంది. మరోవైపు షిండేకు కీలక పదవి ఇవ్వడానికి కేంద్ర పెద్దలు ఓకే చెప్పినట్టు సమాచారం.
Eknath shinde Hospitalised: మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండు మూడు రోజులుగా తీవ్ర గొంతు నొప్పితో బాధపడుతున్న ఆయన ఈ రోజు థానే లోని జూపిటర్ ఆసుపత్రిలో చేరారు. ఏక్ నాథ్ షిండే పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Pawan Kalyan: కేంద్ర పెద్దలైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల మనసులు గెలుచుకున్నాడు పవన్ కళ్యాణ్. వారి ఆజ్ఞాలను వారి పార్టీ వారు పాటిస్తున్నారో లేదో కానీ పవన్ కళ్యాణ్ మాత్రం.. మోడీ, అమిత్ షాలు ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం తనదైన శైలిలో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో పవన్ పై కేంద్ర పెద్దలకు గురి కుదిరింది.
Maharashtra CM: మహారాష్ట్రలో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే విషయంలో కేంద్ర పెద్దలు తేల్చి చెప్పేసారు. ఈ నెల 5న బీజేపీ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే క్లారిటీ ఇచ్చారు. దీంతో దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ మధ్యలో ఫడణవీస్ కు జేపీ నడ్డా ప్లేస్ లో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి మరో వ్యక్తిని సీఎం చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై రేపు క్లారిటీ రానుంది.
Maharashtra CM: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలిచినా.. సీఎం పదవిపై మాత్రం ఉత్కంఠ వీడటం లేదు. ఇది డైలీ సీరియల్ ను తలపిస్తోంది. సీఎం పదవిపై బీజేపీ, శివసేన షిండే మధ్య ఊగిసలాడుతోంది. గత ఎన్నికల్లో ఉద్ధవ్ బీజేపీతో ఎలా బిహేవ్ చేసాడో.. ఇపుడు సీఎం పదవి కోసం అదే సీన్ ను ఏక్ నాథ్ షిండే రిపీట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక రకంగా బీజేపీపై ఏక్ నాథ్ షిండే అలిగినట్టు కనిపిస్తోంది.
Maharashtra CM: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మహా విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేనే కొనసాగించాలని శివసైనికులు కోరారు. కానీ ఎక్కువ సీట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీ న్యాయంగా ముఖ్యమంత్రి పదవి తమకే దక్కాలని అంటోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠంపై నిన్నటి వరకు పట్టు పట్టిన షిండే.. కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది.
Eknath Shinde: తాజాగా మహారాష్ట్రకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ..నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో విజయం సాధించినా.. ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి వీడటం లేదు. సీఎం పదవి ఫడ్నవిస్, షిండేల మధ్య దోబూచులాడుతోంది. అయితే.. మెజారిటీ సీట్లు సాధించిన బీజేపీనే ముఖ్యమంత్రిగా కావడం దాదాపు కన్ఫామ్ అని చెబుతున్నారు. సీఎం పదవి దక్కని నేపథ్యంలో షిండే బీజేపీ హై కమాండ్ ముందు కొన్ని డిమాండ్లు పెట్టనున్నట్టు సమాచారం.
Maharashtra New CM: దేశంలో ఎంపీ సీట్ల పరంగా రెండో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో ఈ నెల 20న ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఇక 23న ఎన్నికల ఫలితాలు వెలుబడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి నాలిగింట మూడు వంతులు సీట్లను గెలిచి సంచలనం రేపింది. విజయం తర్వాత మహారాష్ట్ర సీఎం ఎవరు అవుతారనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది.
Eknath Shinde : తాజాగా మహారాష్ట్రకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, శివసేన షిండే,అజిత్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయ దుంధుబి మోగించింది. అయితే.. ఎలక్షన్స్ లో విజయం తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం బీజేపీ, శివసేన సిగపట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత కేంద్ర పెద్దల సూచనలతో త్వరలో ఢిల్లీలో ప్రచారం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.
Maharashtra Chief Minister: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం విషయంలో ఇటు బీజేపీ, అటు శివసేన షిండే వర్గం ఎవరు వెనక్కి తగ్గకపోవటంతో... బీజేపీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. చెరో రెండున్నర ఏళ్లు సీఎంగా ఇద్దరు ఉండేట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Maharashtra CM: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి అధికారంలోకి వచ్చినా.. ఇప్పటికీ ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి వీడలేదు. ఎన్నికల్లో ఎక్కువగా సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పీఠం తమకే కావాలంటోంది. మరోవైపు కూటమి వెళ్లి గెలిచిన నేపథ్యంలో తమకే సీఎం ఇవ్వాలని శివసేన పట్టుపడుతోంది. మొత్తంగా మహా పంచాయితీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి.
Maharashtra assembly elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుతం మహయుతి గెలుపు లాంఛనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Pawan Kalyan Maharastra: మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. బీజేపీకి ప్రధాన ఆయుధంగా మారాడు. అంతేకాదు ఆయన మహారాష్ట్రలో ప్రచారం చేసిన చోట్ల బీజేపీ కూటమి నేతలు మంచి మెజారిటీ సాధించారు. దీంతో జనసేనాని క్రేజ్ నేషనల్ లెవల్లో పెరిగింది.
Maharashtra Election Result 2024: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ మించి దూసుకుపోతుంది. మొత్తం 288 సీట్లలో బీజేపీ 200 పైగా సీట్లలో లీడింగ్ లో ఉంది. మరోవైపు మహా వికాస్ అఘాడీ 60 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. మొత్తంగా మెజారిటీకి అవసరమైన 145 స్థానాలకు దాటింది.