PM Modi Visit: ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 15 నుంచి 18 వరకు నాలుగు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కెనడా, సైప్రస్, క్రొయేషియా దేశాలను ప్రధాని మోదీ సందర్శిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసి ఈ సమాచారాన్ని అందించింది.
Kerala Rains: భారీ వర్షాలు కేరళలో బీభత్సం సృష్టిస్తున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న భీకర వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. కొన్ని పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
Anti National Conversion: ఈ గడ్డపై పుట్టి, ఈ గాలిని పీల్చి, ఈ నేలపై తిరిగినవాళ్లే వెన్నుపోటు పోడవడాన్ని చూసినప్పుడు అది శత్రుత్వం కాదు.. అది ద్రోహం. జ్యోతి మల్హోత్రా సంఘటన మనకు మరోసారి గుర్తు చేస్తోంది.. మన దేశానికి ముప్పు బయట నుంచే కాదు, లోపల నుంచీ వస్తోంది. మన మధ్య నడిచినవాళ్లే, మనతో పెరిగినవాళ్లే.. ఈ తల్లి బిడ్డలనే మోసం చేస్తూ, శత్రువుల ఒడిలోకి జారిపోతున్నారు. చాలా మందిలో మతంతో పాటు మర్మం కూడా మారిపోయింది. వేరే దేశాల కుట్రలకు ఊతమిస్తూ దిగజారిపోతున్నారు. ఇప్పుడు మీరు చూడబోయే వారంతా ఆ 'అంతర్గత శత్రువుల' జాబితాలోని పేర్లు. వీరు దేశభక్తులుగా పుట్టినవాళ్లు కాదు.. దేశద్రోహానికి మారుపేరు
Delhi Rains: మండే ఎండల్లో దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
Pahalgam Tourists: జమ్మూకశ్మీర్ లోని అందమైన ప్రదేశం పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మారణహోమం తర్వాత కాశ్మీర్ లో మళ్లీ టూరిస్టులు అడుగుపెడతారా అనే అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఇప్పుడు పహల్గామ్ యాత్రికులతో సందడిగా మారింది.
PM Modi Receives Warm Welcome in Bangkok: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన థాయిలాండ్, శ్రీలంక దేశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో, మోదీ బ్యాంకాక్లో జరిగే BIMSTEC (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) సదస్సులో పాల్గొంటారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన బ్యాంకాక్కు చేరుకోగా, అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో మోదీ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ సహకారం, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారు. BIMSTEC సదస్సులో, సభ్య దేశాలు ప్రాంతీయ భద్రత, ఆర్థిక
Khushbu: బీహార్కు చెందిన 11వ తరగతి విద్యార్థిని ఖుష్బూను ఆమె తల్లిదండ్రులు సైన్స్కు బదులుగా ఆర్ట్స్ స్ట్రీమ్ తీసుకోవాలని బలవంతం చేశారు. సైన్స్ విభాగంలో ఖుష్బూ అడ్మిషన్ ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని విద్యా మంత్రి ఆమెకు ఫోన్లో హామీ ఇచ్చారు.
Boycott OYO Trending Whats Happens You Know: అత్యంత ప్రాచుర్యం పొందిన ఓయో సంస్థపై నెట్టింట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక చిన్న పని ఓయో సంస్థను బహిష్కరించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Banks Strike: దేశంలో ఉంటున్న జాతీయ బ్యాంకులు తమ కోరికల కోసం మరోసారి రోడ్డెక్కనున్నాయి. ఇందుకు సమ్మె నోటీసు ఇచ్చాయి. అంతేకాదు కేంద్ర ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేసాయి.
Three Days Wine Shops Close Check Here Dates: మందుబాబులకు భారీ షాక్ తగిలింది. మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఉన్నఫళంగా ఎందుకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు? ఎప్పుడు? ఎక్కడ మూస్తున్నారో ఆ వివరాలు తెలుసుకోండి.
Manmohan Sigh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్రపై ఓ సినిమాను కూడా తీశారు. ఈ సినిమాలోని 7 డైలాగులు సంచలనం క్రియేట్ చేశాయి. అవేంటో చూద్దాం.
SC On Marriage System: హిందూ వివాహం అనేది ఒక పవిత్రమైన ఆచారమని, అది కుటుంబ పునాదులను పటిష్టం చేసేందుకు ఉద్దేశించినదే తప్ప వాణిజ్య ఒప్పందం కాదని ఒక వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు పేర్కొంది.
Sabarimala Temple Devotee Suicide: పవిత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆలయం పై అంతస్తు నుంచి ఓ భక్తుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ సంఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Priyanka Gandhi's new Bag: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. వయనాడ్ నుంచి ఉప ఎన్నికల్లో గెలిచిన ప్రియాంక గాంధీ..ఈమధ్యే పార్టెమెంటులో ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో ప్రియాంక..సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఆమె తొలిసారిగా పార్లమెంట్లో చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. అయితే సోమవారం పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ వేసుకుని పార్లమెంట్ లోకి వచ్చారు. పాలస్తీనాకు మద్దతుగా ఈబ్యాగ్ ను ప్రియాంక వేసుకున్నారు. మంగళవారం బంగ్లాదేశ్ బ్యాగు వేసుకుని రావడంతో విమర్శలకు కేంద్రంగా మారింది.
Forex Market: రూపాయి విలువ మరింత క్షీణించింది. సోమవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. ఒక్క రోజే మరో 11 పైసలు దిగజారి..మునుపెన్నడూ లేని విధంగా 84.91 స్థాయికి పతనం అయ్యింది.బలహీన దేశీయ మార్కెట్లు, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల భారత రూపాయి క్షీణించిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ వడ్డీ రేటు తగ్గించే అవకాశాలు పెరగడం..దేశీయ మార్కెట్లలో బలహీనత కారణంగా రూపాయి ప్రతికూలంగా మారింది.
Farmers Delhi Protest: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా పలు అంశాలపై డిమాండ్ల నెరవేర్చుకోవడనాికి ఢిల్లీలోని రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ శుక్రవారం రైతు సంఘాల ర్యాలీలు శంభు నుంచి స్టార్ట్ అయింది. అయితే.. ఢిల్లీని ముట్టడించడానికి రైతులు మరో ప్లాన్ చేస్తున్నారు.
Gold and Silver Rate: బంగారం ప్రియులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగింది. తులం రేటు రూ. 71,150 దగ్గర కొనసాగుతోంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 ఎగబాకి ప్రస్తుతం పది గ్రాములకు రూ. 77, 620 దగ్గర ట్రేడవుతోంది. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కేజీ వెండి ప్రస్తుతం రూ. 1.01లక్షల వద్ద ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతూనే ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.