SSC exams 2020: హైదరాబాద్: తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇప్పుడే 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం అవసరమా అని ఇప్పటికే హైకోర్టు ( TS High court ) ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇవాళ జరిగిన విచారణలోనూ హై కోర్టు పలు కీలకమైన ప్రశ్నలు లేవనెత్తింది.
లాక్డౌన్ కారణంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. అయితే 10th Class Exams ఫలితాలు భవిష్యత్తులో ప్రామాణికంగా పరిగణిస్తారు.
తనకు భారత పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని నేత చెన్నమనేని రమేష్ హైకోర్టుకు విన్నవించుకున్నారు. తదుపరి విచారణను జూన్కు హైకోర్టు వాయిదా వేసింది.
గన్ మెన్ల ఉపసంహరణ అంశంపై హైకోర్టు తీర్పు నాగం జనార్థన్ రెడ్డికి అనకూలంగా వచ్చింది. తనకు గన్ మెన్లను తొలగించిన అంశంపై హైకోర్టులో నాగం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. తనపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ప్రభుత్వం కావాలనే తన భద్రతను ఉపసంహరించుకుందని పిటిషన్ లో పేర్కొన్నారు.
నాగం పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన ధర్మాసనం నాగం తరఫు న్యాయవాది వాదనలను సమర్ధించింది. అంతే కాదు నాగంకు భద్రతను ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.