Covid-19: తెలంగాణలో లక్ష దాటిన కోలుకున్న వారి సంఖ్య

తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. నిరంతరం కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

Last Updated : Sep 4, 2020, 10:20 AM IST
Covid-19: తెలంగాణలో లక్ష దాటిన కోలుకున్న వారి సంఖ్య

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. నిరంతరం కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే.. గత 24 గంటల్లో గురువారం ( సెప్టెంబరు 3న ) తెలంగాణలో  కొత్తగా 2,478 కరోనా కేసులు నమోదు కాగా.. 10 మంది వైరస్‌తో మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,35,884కి పెరిగింది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 866 మంది మరణించారు.  Also read: విశాఖపట్నం వచ్చినప్పుడు కలుస్తానమ్మా: పవన్ కల్యాణ్

ఇప్పటివరకు రాష్ట్రంలో 1,02,024 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 32,994 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.  ఇదిలాఉంటే.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 16,05,521 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 75శాతం ఉండగా.. మరణాల రేటు 0.63శాతంగా ఉంది. ఇదిలాఉంటే.. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీలో 267 కరోనా కేసులు నమోదు కాగా..  మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరిలో 190, రంగారెడ్డి జిల్లాలో 171 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు.. ఇలా ఉన్నాయి..

telangana corona cases bulletin

Also read: Pawan Kalyan: పవన్ 28 మూవీ.. క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

Trending News