మీడియాకు అంత అత్యుత్సాహం పనికిరాదు: ఏపీ సీఎం చంద్రబాబు

విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో ఒకింత అసహనం వ్యక్తంచేసిన ఏపీ సీఎం చంద్రబాబు

Last Updated : Mar 8, 2018, 01:09 PM IST
మీడియాకు అంత అత్యుత్సాహం పనికిరాదు: ఏపీ సీఎం చంద్రబాబు

కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ప్రతిగా నిరసన తెలియజేస్తూ కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు అని అన్నారు. బుధవారం రాత్రి ఏపీ రాజధానిలోని నూతన సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రం పట్ల తమ వైఖరి ఏంటో తెలియజేసిన చంద్రబాబు.. అనంతరం కొంతమంది విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మాత్రం ఒకింత అసహనం వ్యక్తంచేశారు. కేంద్రంలో అధికారంలో వున్న ఎన్డీఏకి దూరం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో మున్ముందు ఏ రాజకీయ పార్టీతో జత కడతారు అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ... మీడియాకు అంత అత్యుత్సాహం పనికిరాదు అని అన్నారు. 

పాత్రికేయులని ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మీడియా వాళ్లు కూడా కొంచెం అదుపులో వుండాలి. మీరు కూడా ప్రతీ ఒక్క విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు అని కాస్త కటువుగానే బదులిచ్చారు. తాను ప్రస్తుతం రాజకీయాలు చేయడం లేదు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పాటుపడుతున్నా. ఇటువంటి సమయంలో రాజకీయాలు తగవు అని ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

Trending News