ఈ రోజు వరకు సల్మాన్ ఖాన్ గంజాయి తాగి పడుకున్నాడా..?

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై ఈ మధ్యకాలంలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. 

Last Updated : Aug 22, 2018, 09:07 PM IST
ఈ రోజు వరకు సల్మాన్ ఖాన్ గంజాయి తాగి పడుకున్నాడా..?

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై ఈ మధ్యకాలంలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇటీవలే మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన స్వర్గస్థులైన ఇన్నాళ్లకు సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. "‘అటల్‌జీ లాంటి మంచి నాయకుడు, ఆయన ప్రసంగాలు చాలా బాగుంటాయి, అంత గొప్ప మనిషిని కోల్పోవడం చాలా బాధగా ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు. అయితే సల్మాన్ ఖాన్ ఇంత ఆలస్యంగా ట్విట్టర్‌లో స్పందించడం చూసి అనేకమంది ఆయనను ట్రాల్ చేయడం ప్రారంభించారు.

బహుశా ఇన్ని రోజులు సల్మాన్ గంజాయి మత్తులో ఉండి ఉంటాడని.. అందుకే ఇప్పుడు ట్వీట్ చేశాడని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అలాగే  ‘టైగర్‌ జిందా హై’ సినిమాని గుర్తుచేస్తూ.. "చూశారా.. ఇన్నాళ్లు ఈ టైగర్ నిద్రమత్తులో జోగులాడింది. ఇప్పుడే దీనికి తెల్లారింది" అని ట్వీట్ చేశారు. మరొకరు కూడా ఇలాగే ట్వీట్ చేశారు. "సల్మాన్ భాయ్.. మీరు ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టండి. మద్యం తాగుతూ ఇంత ఆలస్యం లేస్తే ఎలా.." అని మరో నెటిజన్ కూడా ట్వీట్ చేశారు. 

మరొకరేమో సల్మాన్ ఖాన్ "ట్యూబ్ లైట్" సినిమా ప్రమోషన్ మళ్లీ మొదలుపెట్టాడని ట్వీట్ చేయగా.. మరొక నెటిజన్ ఏమో సల్మాన్ ఖాన్ ఏ రకం గంజాయి వాడుతున్నారో తెలుసుకోవాలని ఉందని ట్వీట్ చేశాడు. కొందరేమో దీనిని లాంగ్ హ్యాంగ్ ఓవరుగా కూడా అభిప్రాయపడ్డారు. సల్మాన్ ఖాన్ నటించిన రేస్ 3 చిత్రం ఇటీవలే విడుదలైంది. ఆయన నటిస్తున్న "భారత్" చిత్రం 2019లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా నిర్మాతల్లో సల్మాన్ ఖాన్ కూడా ఒకరు కావడం గమనార్హం. 

 

 

Trending News