వివాహ వేడుకకు హాజరై వెళ్తుండగా విషాదం

వివాహ వేడుకకు హాజరై తిరుగు వెళ్తుండగా విషాదం చోటుచేసుకుంది. ఆటో బోల్తా పడటంతో నలుగురు మృతిచెందారు.

Last Updated : Mar 15, 2020, 11:32 AM IST
వివాహ వేడుకకు హాజరై వెళ్తుండగా విషాదం

శ్రీకాకుళం: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలకు హాజరై వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులలో తండ్రీకొడుకులు ఉండటం గమనార్హం. ఆ వివరాలిలా ఉన్నాయి... శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలి కొత్తకొటకు చెందిన కొందరు నరసన్నపేటలో తమ బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరయ్యారు. శనివారం రాత్రి వివాహ వేడుకల నుంచి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.

See Photos: అందమైన భామలు.. లేత మెరుపు తీగలు

కాగా, బైరికూడలి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తోన్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, ఒకరు చికిత్స పొందుతూ చనిపోయాడు. తండ్రీకొడుకులు వెంకటి, సింహాచలం, శ్రీలత అనే మహిళ ఘటనా స్థలంలోనే చనిపోగా, ఈ ఘటనలో గాయపడ్డ 8 మందిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర రక్తస్రావం కావడంతో గణేష్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.  

మరిన్ని క్రైమ్ కథనాల కోసం క్లిక్ చేయండి

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

Trending News