Balineni Srinivas Reddy : బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్సీపీకి షాక్ ఇచ్చాడు. రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. చిత్తూరు నెల్లూరు తిరుపతి జిల్లాలకు కో ఆర్డినేటర్గా ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
Chandrababu Naidu : అబద్దాల కోరు సీఎం జగన్ను రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని బంగాళాఖాతంలో కలిపేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ పరిగెడుతుందని ప్రజల్లో ఉత్తేజాన్ని నింపాడు.
Vizag Kidney Rocket : విశాఖలోని కిడ్నీ రాకెట్ మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కిడ్నీ దందా నిర్వహించిన తిరుమల హాస్పిటల్ను సీజ్ చేసింది. డీఎంహెచ్వో నివేదికతో ఆస్పత్రిని సీజ్ చేశారు. అనుమతి లేకుండా ఆపరేషన్ చేయడంతో సీజ్ చేశారు.
Chandrababu Naidu On CM Jagan: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఒక యుగపురుషుడు పుట్టినట్టే.. యుగానికి ఒక రాక్షసుడు పుట్టాడంటూ ఫైర్ అయ్యారు. దళిత నేతల సమావేశంలో ‘దళితద్రోహి జగన్ రెడ్డి: దళితబాంధవుడు-పేదలపెన్నిధి చంద్రన్న’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Visakhapatnam Inter Student: విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఓ విద్యార్థిని వైసీపీ నేత చితక్కొట్టాడు. బాలుడు తన కారులో కూర్చొని ఉండడంతో దొంగతనం కోసం వచ్చాడని ఆగ్రహంతో దుస్తులు విప్పించి నగ్నంగా నిల్చొబెట్టాడు. బాలుడిపై పిడిగుద్దులు కురిపించాడు. వివరాలు ఇలా..
Avinash Reddy Released Video Over Viveka Murder Case: వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో వివరిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి వీడియోను విడుదల చేశారు. ఆ రోజు వివేకా రాసిన లెటర్ను రాజశేఖర్ రెడ్డి, సునీతమ్మ ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. సీబీఐ ఎందుకు ఈ లెటర్ను డౌన్ ప్లే చేస్తుందని అడిగారు. ఆ వీడియో ఆయన చెప్పారంటే..?
Telangana High Court Cancels Erra Gangireddy Bail: ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న గంగిరెడ్డి బయట ఉంటే.. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కోర్టులో సీబీఐ వాదించింది. సీబీఐ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.
CM Jagan Comments On Chandrababu Naidu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ముసలి పులితో పోల్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. నరమాంసం తినే పులి ముసలిదైపోయిందని.. దగ్గరకు వస్తే తినేద్దామని చూస్తోందంటూ పంచతంత్ర కథతో పోల్చారు. అనంతపురం జిల్లా నార్పలలో జగనన్న వసతి దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.
MLA Rachamallu Siva Prasad Reddy Comments on MP Avinash Reddy Arrest: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. అయితే బెయిల్పై మళ్లీ విడుదల అవుతారని.. ఆయన కుట్ర జరుగుతోందన్నారు.
Stamps And Registration User Charges Increased: ఏపీలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ యూజర్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకేసారి భారీ మొత్తం పెంచింది. కొత్త ధరలు మంగళవారం నుంచే అమల్లోకి రానున్నాయి.
How To Check Inter Results 2023: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షాల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఇంటర్ రిజల్ట్స్ను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఏ వెబ్సైట్స్లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి..? ఎలా చెక్ చేసుకోవాలి..? వివరాలు ఇలా..
JC Prabhakar Reddy : తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన దీక్ష కొనసాగుతోంది. మున్సిలప్ కార్యాలయంలోనే నిద్రపోయిన ఆయన కాలకృత్యాలు కూడా అక్కడే నిర్వహించారు. మున్సిపాలిటీ అక్రమాలను నిరసిస్తూ దీక్ష చేశారు.
YS Sunitha : వైఎస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కడప జిల్లా, ప్రొద్దుటూరులో పోస్టర్లు కలకలం రేపుతోంది. వైఎస్ సునీతమ్మ టీడీపీలో చేరబోతోన్నట్టుగా పోస్టర్లు వెలిశాయి. ఆమె రాజకీయ రంగం ప్రవేశం మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.
YS Sunitha Reddy Political Entry Posters: మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా..? ఆమె టీడీపీలో చేరనున్నారా..? ప్రస్తుతం కడప జిల్లా ప్రొద్దుటూరులో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
Nellore Mayor Potluri Sravanthi Issue: నెల్లూరు కౌన్సిల్ సమావేశంలో కొందరు కార్పొరేటర్లు తనపై దౌర్జన్యానికి యత్నించారని ఆరోపించారు మేయర్ పొట్లూరి స్రవంతి. తన చీర లాగేందుకు యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
TTD Alerts Devotees On Fake Website: నకిలీ వెబ్సైట్లతో తిరుమల శ్రీవారి భక్తులను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా మరో నకిలీ వెబ్సైట్ను గుర్తించారు టీటీటీ ఐటీ అధికారులు. ఇలాంటి ఫేక్ వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Times Now Servey : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన వైఎస్సార్ సీపీ ఓ గుడ్ న్యూస్ లభించింది. ఏపీలో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తాడని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. లోక్ సభ స్థానాలన్నింటిని క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపింది.
Botsa Satyanarayana on DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఉద్యోగుల బదిలీ అంశం కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.
Chandrababu Naidu : చంద్రబాబుకు ఎర్రగుండ పాలెంలో తిరిగే అర్హత లేదని ఏపీ మాత్రం ఆదిమూలపు సురేష్ అన్నారు. దళితులను అవహేళన చేసిన చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. అన్ని రంగాల్లోనూ ఆయన దళితులకు అన్యాయం చేశారని అన్నారు.
Viveka Second Wife Statement: వివేకా హత్య కేసులో తొలిసారి ఆయన రెండో భార్య షేక్ షమీమ్ స్టేట్మెంట్ తెరపైకి వచ్చింది. 2010లోనే తనను వివేకా పెళ్లి చేసుకున్నారని ఆమె వెల్లడించారు. తమకు కొడుకు షేహన్ షా జన్మించాడని.. డీఎన్ఏ టెస్టుకు కూడా సిద్ధమని సవాల్ విసిరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.