లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన నేరం కింద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ( Bandi Sanjay ) నల్గొండ జిల్లా పెద్దవూర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెద్దవూర మండల పరిధిలోని బత్తాయి తోటలను పరిశీలించి రైతులను కలిసేందుకు వచ్చిన బండి సంజయ్... అక్కడే ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆయన వెంట బీజేపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డితో పాటు పార్టీకి చెందిన స్థానిక నేతలు కూడా ఉన్నారు.
కరోనావైరస్ సంక్షోభంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారికి సంఘీభావం వ్యక్తంచేస్తూ శుక్రవారం నాడు తాను ఒక రోజు ఉపవాస దీక్ష చేపడతానని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.
బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కరీంనగర్ ఎంపి బండి సంజయ్ (Bandi Sanjay).. ''సామాన్య కార్యకర్తను అయిన తనకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు చెబుతున్నాను'' అని అన్నారు.
బండి సంజయ్ కుమార్.. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో స్వయం సేవకుడిగా ఉన్న ఆయన ఆ తర్వాతి కాలంలో అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్లో (ABVP) చేరి అంచలంచలుగా ఎదిగారు. ఏబీవీపీ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కొద్దిసేపటి క్రితమే ఓ లేఖ విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.