పాకిస్తాన్ మానవ హక్కుల మంత్రిత్వ శాఖ మంత్రి షిరీన్ మజారీ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రధాన సమస్యగా పరిగణిస్తున్న వంటి కాశ్మీర్ వివాదానికి ఒక పరిష్కారం ఉండాలనే తాము కోరుకుంటున్నామని తెలిపారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఢిల్లీలో భేటీ కానున్నారు.
ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలో దాదాపు కేంద్రానికి వ్యతిరేకంగా పనిచేస్తోన్న రాజకీయ పార్టీలన్నీ ఏకమైన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవం వేదికపై ఒక్కచోటకు చేరిన ప్రతిపక్షాలను చూస్తే 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ ఎన్డీఏను ఎదుర్కునేందుకు ఈ పార్టీలన్నీ ఏకమవుతాయా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలా ఏకమైన ప్రతిపక్ష పార్టీలతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం చేయి కలపడంతో 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమితో అరవింద్ కేజ్రీవాల్ చేయి కలుపుతారా అనే చర్చ కూడా జరిగింది.
2019 ఎన్నికల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తాను ఎంత గొప్ప వ్యక్తి మీదనైనా సరే పోటీకి నిలవడానికి సిద్ధమని విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా తెలిపారు.
2019లో ప్రధాని పదవి ఖాళీగా లేదని.. వీలైతే 2024లో ఆ పదవిని పొందేందుకు కాంగ్రెస్ లేదా ఇతర పార్టీ అయినా ఇప్పటి నుండే కష్టపడి పనిచేయాలని లోక్ జన శక్తి పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ జోకులు వేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.