Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు చేశారు. సత్యనారాయణ వ్రతం పూజ కార్యక్రమంలో భారీగా భక్తులు హాజరవగా.. వారికి తీర్థ ప్రసాదాలతోపాటు భోజనం అందించారు. కార్తీక మాసం సందర్భంగా వ్రతం చేసినట్లు తెలుస్తోంది.
Minister Satyanarayan Vratham: హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ దంపతులు సత్యనారాయణ వ్రతం చేశారు. కార్తీకమాసం సందర్భంగా వ్రతం చేయడం ఆనవాయితీ. ఆదివారం చేసిన ఈ వ్రతంలో పెద్ద ఎత్తున మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Minister Ponnam Prabhakar: ట్రాన్స్ పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ టీజీఎస్ ఆర్టీసీ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లో తీసుకొని వచ్చేందుకు అధికారులు వినూత్నంగా ముందుకు వెళ్లాలన్నారు. అంతేకాకుండా కొత్తరూట్ లలో బస్ లను నడపాలన్నారు. ఒకవైపు ప్రయాణికుల భద్రతను కాపాడుతూనే, ఆర్టీసీని లాభాల్లో తీసుకొని వచ్చేందుకు అధికారులు పాటు పడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సూచనలు చేశారు.
Ponnam Prabhakar: తెలంగాణ ట్రాన్స్ పొర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాగంటి సునీతపై పంచ్ లు వేశారు. ఇప్పుడు కూడా సింపతీ కల్గించే విధంగా మాట్లాడటంను తప్పుబట్టారు. ప్రజల నుంచి సానుభూతి పొందే ప్రయత్నాలు మానుకొవాలన్నారు. ఎన్నికల ప్రచారం తర్వాత తాము ఎవ్వరం కూడా జూబ్లిహిల్స్ ఏ కౌంటింగ్ హల్ వద్దలేమని కూడా పొన్నంప్రభాకర్ స్పష్టం చేశారు. ఎలాగో గెలవమని తెలిసి ఈ విధంగా మాగంటి సునీత సింపతీడ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
Minister ponnam Prabhakar on road safety rules: మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమావేశం అయ్యారు. ఇక మీదట ట్రాఫిక్ రూల్స్ ను కఠినంగా అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా హైవే పై వెళ్లే వాహనాలు ట్రాఫిక్ నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేసేలా చూడాలన్నారు.
Ponnam Prabhakar reacts on Kurnool bus accident: ప్రయాణికుల ప్రాణాలతో చలగాటం ఆడితే ఇక మీదట సహించేదిలేదన్నారు. రూల్స్ ను అతిక్రమించిన వారిపై హత్యానేరం కింద కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేశారు.
Check Posts Close: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రవాణా చెక్ పోస్టులు మూసివేస్తూ సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందికి వేరే బాధ్యతలు అప్పగించాలన్నారు. రికార్డులు, పరికరాలు, ఫర్నీచర్ను డీటీవో ఆఫీస్కు తరలించాలన్నారు. అన్ని ఆర్థిక, పరిపాలన రికార్డులను సరిచూసి భద్రపరచాలని ఆదేశించారు. వాహన రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని..చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బారికేడ్లు తొలగించాలని డీటీవోలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Ponnam Prabhakar: జుబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు తమదైన శైలీలో దూసుకుని పోతున్నాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి కాంట్రవర్సీగా మాట్లాడారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటీ సునీత ఆర్టీఫియల్ గా ఏడుస్తున్నారని, ప్రతి సభలో ఏడవాలని బీఆర్ఎస్ నేతలు ట్రైనింగ్ ఇచ్చారని, సానుభూతితో గెలవాలని బీఆర్ఎస్ భావిస్తుందని ఎద్దేవా చేశారు.
BRS Party Demands Apology From Tummala And Ponnam: భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారి వ్యాఖ్యలు చేస్తుండడం తీవ్ర దుమారం రేపుతోంది. తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Tummala And Ponnam Must Say Apology To Maganti Sunitha Gopinath Tears: రాజకీయాలు హుందాగా ఉండాలి.. మానవత్వం ఉండాలి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవేవీ లేకుండా వ్యవహరిస్తుండడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్త పోయి రోదిస్తున్న మాగంటి సునీత కన్నీటిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టింది.
Konda Surekha Vs Ponguleti Srinivas Reddy: తెలంగాణ మంత్రివర్గంలో గత కొన్ని రోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు గత కొన్ని రోజులుగా భగ్గు మంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటెనే విపరీత స్వాతంత్య్రం. ఇక్కడ ఎవరి నోటికి వచ్చినట్టు వారు మాట్లాడుకుంటూ పోతుంటారు. రీసెంట్ గా పొన్నం ప్రభాకర్, అడ్లూరి శ్రీనివాస్ వివాదం ముగియక ముందే కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మద్య వివాదం రాజుకుంది.
Adluri Laxman: తెలంగాణలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారాయి. అడ్లూరీ లక్ష్మణ్ దీనిపై సీరియస్ అయ్యారు. పొన్నం తన మాటల్ని ఉపసంహరించుకుని,సారీ చెప్పాలన్నారు. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. దీనిపై ఎంతదూరమైన వెళ్తామని హెచ్చరించారు. మరోవైపు పొన్నం దీనిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు వివరణ ఇచ్చానని, ఆయన చెప్పినట్లు నడుచుకుంటానన్నారు.
Ponnam prabhakar Vs Adluri Laxman: మంత్రిపొన్నం ప్రభాకర్ పై ఏకంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నేతలు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Ponnam Prabhakar: మనకు టైం అంటే ఏంటో తెలుసు..జీవితమంటే ఏంటో తెలుసు..వారికేం తెలుసు.. ఆ దున్నపోతుగానికి..అంటూ సహచర మంత్రిని ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు నెట్టింట్లో రచ్చగా మారాయి. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ఇంచార్జీ మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అంతా వచ్చారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సహచర మంత్రి ఒక టైంకు రాలేదు. దీంతో పొన్నం అసహనానికి లోనై..పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో గుసగుసలాడారు. మనకు సమయం తెలుసు..జీవితం తెలుసు..కానీ వారికేం తెలుసు ఆ దున్నపోతుగానికి అంటూ మాట్లాడిన మాటలు మైక్ లో బయటకు వినిపించాయి.
Heavy rains in Hyderabad: భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. అధికారులంతా సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు.
Minister ponnam Prabhakar on raja singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించడం దారుణమని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో దీనితో బీజేపీ కపటబుద్ది మరోసారి బైటపడిందని అన్నారు.
Ponnam Prabhakar Made Clay Pot: బోనాల వేడుకలు తెలంగాణలో అంగరంగ వైభవంగా ప్రారంభమవగా.. ఈ వేడుకల్లో పొన్నం ప్రభాకర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ట్యాంక్బండ్పై జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మట్టి కుండ చేసి సందడి చేశారు. ఆ వీడియో వైరల్గా మారింది. మీరు కూడా చూసేయండి.
Ponnam Prabhakar Trvel In RTC Bus: ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణం చేశారు. సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్గేట్ నుంచి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ వెళ్లే బస్సులో పొన్నం ప్రభాకర్ ప్రయాణం చేసి మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లను పలకరించి మీ సమ్మెను మాట్లాడి ఆపివేయించామని గుర్తుచేశారు. అనంతరం మహిళలతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు.
Telangana Govt Likely To Give Rice Mill Business: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మరో బంపర్ బొనాంజా ప్రకటించే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలుగా మహిళలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. ఈ విషయమై ఓ మంత్రి కీలక ప్రకటన చేశారు.
Telangana Leaders Fly To New Delhi For BC Reservation Bill: తెలంగాణ నుంచి బీసీ రిజర్వేషన్ల బిల్లు ఢిల్లీకి మారగా.. తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా హస్తిన బాట పట్టనున్నారు. అక్కడ జరిగే ధర్నాలో పాల్గొనడంతోపాటు కేంద్ర పెద్దలను బీసీ ప్రజాప్రతినిధులు కలవనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.