YS Jagan Siddham Meeting: ఎన్నికలకు కొన్ని రోజులే గడువు ఉండడంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీగా ప్రచారం చేస్తోంది. 'సిద్ధం' పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభ మేదరమెట్లో నిర్వహించగా ప్రజల నుంచి ఊహించని స్పందన లభించింది. ఇక్కడ సీఎం జగన్ గర్జించారు.
YS Jagan Kuppam Tour: మూడు దశాబ్దాలుగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నా కుప్పం నియోజకవర్గంపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. గత ఎన్నికల్లోనే బాబును ఓడించినంత పనిచేసిన వైసీపీ ఈసారి ఎన్నికల్లో అతడి ఓటమే ధ్యేయంగా పని చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా సీఎం జగన్ కుప్పంలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
AP Politics: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విభిన్నం. కులానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే ఏపీ రాజకీయాల్లో ఇటీవల అసభ్య పదజాలంతోపాటు ట్రెండింగ్ అంశాలు చొచ్చుకుని వచ్చాయి. ఇప్పుడు కుర్చీ, కాలర్, సిద్ధం వంటి విభిన్నమైన పదజాలం రాగా.. తాజాగా ముద్దపప్పు, కోడిగుడ్డు కూడా తోడయ్యాయి. దీంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
Actor Ali Politics: ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నాళ్ల నుంచో పోటీ చేయాలని భావిస్తున్నా నటుడు అలీకి అవకాశం మాత్రం దక్కడం లేదు. ఈసారిగా కూడా ఆ అదృష్టం లభిస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అలీ కీలక ప్రకటన చేశారు.
Yatra 2 Collections: ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు థియేటర్స్కు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి .. తొలిసారి ముఖ్యమంత్రి అవ్వడానికి తోడ్పడ్డ పాదయాత్ర నేపథ్యంలో 'యాత్ర 2' మూవీ తెరకెక్కింది.
Yatra 2 Movie Review: వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికల్లో చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన మూవీ 'యాత్ర'. ఇపుడు ఆ సినిమాకు కొనసాగింపుగా దర్శకుడు మహి వి రాఘవ 'యాత్ర 2' మూవీ తెరకెక్కిచాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Andhra Pradesh: సాక్షి దినపత్రికలో తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని కాంగ్రెస్ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరీ ఇంత దిగజారీ ప్రవర్తించడం అవసరమా.. అంటూ షర్మిలా ఎద్దేవా చేశారు.
Minister Roja: మినిస్టర్ రోజా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన రోజా అక్కడ సత్తా చాటింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. ఈమె తాజాగా ఇపుడు ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై వైఎస్ షర్మిల స్పందించారు. తన కుటుంబంపై తప్పుడు నిందలు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. తనలో ప్రవహించేది వైఎస్సార్ రక్తమని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ ప్రజలు, బీజేపీ దేశ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయని విమర్శించారు.
Sensational Comments: రాజకీయాల్లోకి ప్రవేశించిన తన సోదరి షర్మిలపై తొలిసారి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆమె పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును జాకీలు పెట్టి లేపేందుకు చాలా మంది వస్తున్నారని విమర్శలు చేశారు. తనకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని స్పష్టం చేశారు.
Yatra 2 Lyrical Song: దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన యాత్ర మొదటి పార్ట్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం, వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి పై వస్తున్న యాత్ర2 పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం నుంచి ఈరోజు ఒక పాట విడుదల కాగా అది అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది..
YS Jagan Starts Election War: సార్వత్రిక ఎన్నికల సమరానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. గతంలో మాదిరే ఈసారి కూడా ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల యుద్ధ భేరీ మోగించనున్నారు. 175కు 175 స్థానాలే లక్ష్యంగా జగన్ వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుని ఎన్నికల యుద్ధానికి దిగుతున్నారు.
YSR Kapu Nestham Scheme Money: రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తూ 16వ తేదీ నాడు.. అంటే నేడే తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో ఏపీ సీఎం వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు.
Top 10 Richest MLAs In India: దేశంలోనే టాప్ 10 రిచెస్ట్ ఎమ్మెల్యేల జాబితాలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. ఆ ఇద్దరిలో ఒకరు మాజీ సీఎం చంద్రబాబు ఉన్నారు. మరి మిగిలిన ఆ ఒక్కరు ఎవరు, వారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
CM Jagan Visits Flood Affected Areas: వరద బాధితులకు సాయం అందివ్వాలని ఎప్పటికప్పుడు కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశామని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గత వారం రోజులుగా వాళ్లు ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరికీ సాయం చేశారని చెప్పారు.
Second Pension In One Family: ప్రస్తుతం ఏపీలో ఒక రేషన్ కార్డు కింద ఒకరికే పెన్షన్ అందుతోంది. త్వరలో కుటుంబంలో రెండో వ్యక్తికి పెన్షన్ అందజేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాలంటీర్లతో సర్వే నిర్వహిస్తున్నారు.
CM Jagan Mohan Reddy Distributes Tractors: గుంటూరు జిల్లా చుట్టుగుంట సెంటర్లో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ప్రారంభించారు సీఎం జగన్. రైతులు వైఎస్సార్ యంత్ర సేవ యాప్ ద్వారా 15 రోజులు ముందుగా బుక్ చేసుకోవాలని చెప్పారు.
Security Tightened Around CM Jagan Mohan Reddy Residence: ప్రిలిమ్స్ పరీక్ష కటాఫ్ మార్కులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ముఖ్యమంత్రి నివాస ప్రాంతంలో పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. భారీగా పోలీసులను మోహరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.