Telangana Covid-19: రాష్ట్రంలో 43 లక్షలు దాటిన కరోనా టెస్టుల సంఖ్య

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతునే ఉంది. రాష్ట్రంలో మళ్లీ 1,500లకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయమేమిటంటే.. కేసుల కన్నా కరోనా రికవరీ రేటు కూడా ప్రతిరోజూ క్రమంగా పెరుగుతూనే ఉంది.

Last Updated : Nov 1, 2020, 09:31 AM IST
Telangana Covid-19: రాష్ట్రంలో 43 లక్షలు దాటిన కరోనా టెస్టుల సంఖ్య

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతునే ఉంది. రాష్ట్రంలో మళ్లీ 1,500లకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయమేమిటంటే.. కేసుల కన్నా కరోనా రికవరీ రేటు కూడా ప్రతిరోజూ క్రమంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో శనివారం ( అక్టోబరు 31 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,416 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఐదుగురు (5) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,40,048 కి చేరగా.. మరణాల సంఖ్య 1,341 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.  

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,579 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,20,466 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో 18,241 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 91.84 శాతం ఉండగా.. మరణాల రేటు 0.55 శాతం ఉంది. Also read: Doraikkannu: కరోనాతో తమిళనాడు వ్యవసాయ మంత్రి కన్నుమూత

తెలంగాణ వ్యాప్తంగా శనివారం 41,675 కరోనా పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటివరకు (అక్టోబరు 31 వరకు) రాష్ట్రంలో మొత్తం 43,23,666 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 279 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి..

telangana corona cases bulletin

Trending News