Corona Positive Cases: తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

Telangana Corona Positive Cases: రాష్ట్రంలో తాజాగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలో తాజాగా 6,026 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,75,748కి చేరింది.

Written by - Shankar Dukanam | Last Updated : May 6, 2021, 10:45 AM IST
  • తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్
  • కానీ కోవిడ్19 మరణాలు మాత్రం 50కి పైగా నమోదవుతున్నాయి
  • రాష్ట్రంలో తాజాగా 6,026 మంది కరోనా బారిన పడ్డారు
Corona Positive Cases: తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

Telangana Corona Positive Cases: తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ ప్రభావం కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలో తాజాగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలో తాజాగా 6,026 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,75,748కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ గురువారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

తెలంగాణలో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం రాత్రి 8 వరకు గడిచిన 24 గంటల్లో 79,824 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 6 వేల 26 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 75 వేల 7 వందల 48కు చేరింది. కరోనా(CoronaVirus) మహమ్మారితో పోరాడుతూ రాష్ట్రంలో మరో 52 మంది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాలు 2,579కి చేరింది. 

Also Read: COVID-19 Patientsకు సీటీ స్కాన్ వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు, AIIMS డైరెక్టర్

రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో GHMC పరిధిలోనే 1,115 కేసులు నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే తెలంగాణలో ప్రస్తుతం 77 వేల 127 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 1.33 కోట్ల శాంపిల్స్‌కు కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు నేటి ఉదయం హెల్త్ బులెటిన్‌లో వైద్యశాఖ తెలిపింది. తెలంగాణలో చికిత్స అనంతరం నిన్న ఒక్కరోజు కోవిడ్-19 బారి నుంచి 6,551 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,96,042 మంది కరోనా మహమ్మారిని జయించారు. రాష్ట్రంలో కరోనా బారి నుంచి కోలుకుంటున్న వారు 83.24 శాతం ఉన్నారు. జాతీయ సగటు 82 శాతంతో పోల్చితే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా కనిపిస్తోంది.

Also Read: PM Kisan Samman Nidhi: రైతులకు శుభవార్త, పీఎం కిసాన్ స్కీమ్ రూ.2000 త్వరలో ఖాతాల్లోకి

తెలంగాణలో ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు ఇస్తున్నారు. కోవిడ్19(COVID-19) టీకా మోతాదుల కొరత కారణంగా 18 ఏళ్లు పైబడిన వారి నుంచి 44 ఏళ్ల వయసు వారికి టీకాలు పలు కేంద్రాల్లో అందడం లేదు. యువత మాత్రం టీకాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. భౌతిక దూరం పాటించడం, ముఖానికి మాస్కులు ధరించి బయటకు వెళ్లడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకునేందకు శానిటైజర్ వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News