ఏపీ సర్కార్ నిర్ణయం మంచిదే... మూడు రాజధానుల బిల్లు రద్దుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రియాక్షన్...

Union Minister Kishan Reddy on Withdawal of Three Capital Bill: ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీనిపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యమన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2021, 03:12 PM IST
  • మూడు రాజధానుల బిల్లు రద్దుపై కిషన్ రెడ్డి రియాక్షన్
    ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యమన్న కేంద్రమంత్రి
    ప్రజాభీష్టం మేరకే అమరావతి రాజధానికి ఏపీ బీజేపీ మద్దతునిచ్చిందని కామెంట్
ఏపీ సర్కార్ నిర్ణయం మంచిదే... మూడు రాజధానుల బిల్లు రద్దుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రియాక్షన్...

Union Minister Kishan Reddy on Withdawal of Three Capital Bill: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభావాల ప్రకారం రాజధానిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదేనని అన్నారు. ప్రజాభీష్టం మేరకే అమరావతి రాజధానికి ఏపీ బీజేపీ మద్దతు తెలిపిందన్నారు. రైతుల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుందన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో అమరావతి రైతు ఉద్యమానికి (Amaravati farmers) ఏపీ బీజేపీ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అమరావతిలోనే రాజధానిని  కొనసాగించాలన్న డిమాండుతో 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పేరిట రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు బీజేపీ నేతలు (AP BJP) సంఘీభావం ప్రకటించారు. రైతుల పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేశ్ తదితరులు రైతులకు స్వాగతం పలికి సంఘీభావం తెలియజేశారు.

Also Read: ఏపీ మూడు రాజధానుల రద్దుపై మంత్రి కొడాలి నాని ఏమన్నారంటే..

అమరావతి (Amaravati) రాజధానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని... పార్టీ కార్యాలయం కూడా అక్కడే ఏర్పాటు చేస్తామని సోము వీర్రాజు అన్నారు. పురంధేశ్వరి మాట్లాడుతూ... అమరావతిలోనే రాజధాని కొనసాగాలని రెండేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇటీవలే తిరుపతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో దీనిపై చర్చించామన్నారు. రైతులకు బీజేపీ శ్రేణులు అండగా నిలబడుతారని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు అమరావతి పాదయాత్రకు మద్దతు ప్రకటించిన మరుసటిరోజే ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును (AP Three Capital Bill) ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. బిల్లు ఉపసంహరణ వెనుక ఏపీ ప్రభుత్వ ఉద్దేశమేంటనేది ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News