ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవలే ఏపీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా దసరా (విజయదశమి) సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల నుంచి అత్యంత వైభవంగా ప్రకాశవంతంగా జరిగిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Navratri 2020) నేటితో ముగియనున్నాయి. దేవినవరాత్రుల్లో భాగంగా చివరిరోజు.. దసరా (విజయదశమి) పర్వదినం నాడు శ్రీ కనకదుర్గా దేవీ సాక్షాత్తూ సిద్ధిధాత్రి శాక్తేయానుసారముగా శ్రీ రాజరాజేశ్వరి దేవి ( Sri Rajarajeshwari Devi) గా దర్శనమివ్వనుంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) గ్రామ సచివాలం పరీక్షలు 2020 ఫలితాలు సెప్టెంబర్ 20 నుంచి 26 మధ్యలో జరిగాయి. వాటి ఫలితాలను అక్టోబర్ చివరి నాటికి విడుదల చేయనున్నారు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Navratri 2020) దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో, పందిళ్లల్లో కొలువైవున్న శ్రీ కనకదుర్గా దేవి (kanakadurga devi) నిత్య పూజలు అందుకుంటూ రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ మేరకు భక్తులు నిత్య ఉపావాసాలుంటూ.. నవరాత్రుల్లో రోజుకొక అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారి కటాక్షం కోసం నిష్టగా పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections) నిర్వహణపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి (Mekapati Goutham Reddy)గౌతమ్రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మరోసారి కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని నిపుణుల నుంచి హెచ్చరికలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో నవంబరులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమేనని మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు (Navratri 2020) అంగరంగ వైభవంగా.. కన్నులపండువగా కొనసాగుతున్నాయి. కనకదుర్గా దేవి (kanakadurga devi) నిత్య పూజలు అందుకుంటూ రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ.. కోరిన కోరికలు తీర్చే ఆది పరాశక్తిగా విరాజల్లుతోంది. అమ్మవారి కటాక్షం కోసం నవరాత్రులపాటు భక్తులు ఉపవాసాలుంటూ.. నిష్టగా పూజలతో అమ్మవారి అనుగ్రహం కోసం పరితపిస్తున్నారు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా.. కన్నులపండువగా జరుగుతున్నాయి. నిత్య పూజలు అందుకుంటూ రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్న కనక దుర్గా దేవీని కొలిచి భక్తులు అమ్మవారి కటాక్షాన్ని పొందుతున్నారు. అయితే దేవి నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు గురువారం కనకదుర్గా అమ్మవారు కాత్యాయని దేవీ (Maa Katyayani) శాక్తేయానుసారముగా లలితాత్రిపుర సుందరి దేవి ( Sri Lalitha Tripurasundari Devi ) అలంకారంలో భక్తులను అనుగ్రహించనుంది.
దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్న కనక దుర్గా అమ్మవారిని కొలిచి అనుగ్రహన్ని పొందేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. దేవి నవరాత్రుల్లో భాగంగా ఐదో రోజు బుధవారం అమ్మవారు స్కంధమాత (సరస్వతీ దేవి) అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తోంది.
ఏపీలో ఇంటర్ ప్రవేశాలకు 2020-21 విద్యా సంత్సరానికిగానూ తొలిసారిగా ఆన్లైన్ విధానం (AP Inter Online Admission 2020-21) వినియోగిస్తున్నారు. అధికారిక వెబ్సైట్ https://bie.ap.gov.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
దేశ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవాలయాల్లో రోజుకో రూపంలో దర్శనమిస్తున్న కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. ఆ తల్లి అనుగ్రహం కోసం భక్తులు నిత్యం ఉపవాసాలుంటూ నిష్టగా పూజలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా శ్రీ దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు మాత దుర్గాదేవిని రోజుకో అవతారంలో భక్తులు కొలుస్తారు. ఈ రోజుల్లో ఎంతో నిష్టతో ఉపావాసాలుంటూ.. దుర్గాదేవికి విశేష పూజలు చేస్తూ.. అమ్మవారి ప్రసన్నం చేసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన ఆలయాలన్నీ అత్యంత భక్తిపారవశ్యంతో పులకించిపోయాయి. శనివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. ఢిల్లీ, ముంబై, కలకత్తా, లక్నో వంటి నగరాల్లోని ఆలయాలతో పాటు జమ్మూకాశ్మీర్ లోని మాతా వైష్ణో దేవి ఆలయం, ఇంద్రకీలాద్రీపై వెలసిన కనదుర్గమ్మ ఆలయాల్లో 9రోజుల పాటు జరిగే శరన్నవరాత్రి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎంసెట్ – 2020 (AP EAMCET 2020) కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కౌన్సెలింగ్ (Counseling Notification) ప్రక్రియ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. మూడు వారాల క్రితం నిత్యం పదివేలకు చేరువలో నమోదైన కేసులు కాస్త.. ఇటీవల కాలంలో భారీగా తగ్గుముఖం పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిరకాల కోరిక మరికొన్ని గంటల్లో నెరవేరనుంది. కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ( Vijayawada Kanakadurga flyover) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య మిత్ర సదుపాయాన్ని అని ఆసుపత్రుల్లో కల్పించాలి అని స్పష్టం చేశారు.
తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లో రాబోయే రెండు రోజులు.. సోమవారం, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ మేరకు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఇటీవల ప్రవేశపెట్టిన మరో కొత్త పథకం ‘జగనన్న విద్యా కానుక’ (Jagananna Vidya Kanuka). అయితే ఈ పథకం పేరుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan On Jagananna Vidya Kanuka Name) అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాల (Heavy rains) ముప్పు పొంచి ఉంది. తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంతో రోబోయే నాలుగురోజుల్లో ఇరురాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.