కరోనావైరస్ కారణంగా మార్చిలో లాక్డౌన్ ప్రకటించిన నాటినుంచి రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సడలింపుల మేరకు మే నెలలో 230 కొవిడ్ స్పెషల్ రైళ్లను రైల్వేశాఖ ప్రయాణికుల కోసం ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.
యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి (Amrapali Kata) కి కీలక పదవి దక్కింది. ఆమ్రపాలి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) లో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె కేబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. నిత్యం 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) కరోనా బారిన పడ్డారు.
ఆర్య సమాజ్ నేత, సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ (80) అనారోగ్యంతో కన్నుమూశారు. దేశవ్యాప్తంగా జరిగిన అనేక సామాజిక ఉద్యమాలకు, పోరాటాలకు వెన్నుదన్నుగా నిలవడంతోపాటు.. స్వామి అగ్నివేశ్ భ్రూణహత్యలు, వెట్టిచాకిరి, మహిళా సమస్యలపై, సామాజిక అంతరాలపై గొంతెత్తారు.
ఆధునిక ప్రపంచంలో మానవులకు అన్నీ చేరువయ్యాయి. విద్యా, వైద్యం, రవాణా, వసతులు, సాంకేతిక పరిజ్ఞానం ఇలా అన్ని సౌకర్యాలు కొన్నిచోట్లకే దరిచేరాయి.. ఇంకా ఈ సౌకర్యాలు లేని అనేక ప్రాంతాలు.. అలానే సమస్యలతో నిత్యం కొట్టుమిట్టాడుతున్నాయి. సరైన వైద్యం అందక చాలా మంది గిరిజనులు ఇప్పటికీ చనిపోతూనే ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress Party ) నుంచి రాజ్యసభ ( Rajya Sabha ) కు నూతనంగా ఎన్నికైన పరిమళ్ నత్వానీ ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ఛాంబర్లో పరిమళ్ నత్వానీతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు.
బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ మధునగర్లోని తన నివాసంలో మంగళవారం రాత్రి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె సుమారు ఎనిమిదేళ్లుగా బుల్లితెర నటిగా పనిచేస్తోంది.
Andhra Pradesh Unlock 4 Guidelines | దేశ వ్యాప్తంగా మెట్రో రైలు సర్వీసులు సైతం నేడు (సెప్టెంబర్ 7న) ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ లో ( Andhra Pradesh ) రోజు రోజుకూ కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు, రాజకీయ నాయకులను కూడా ఈ వైరస్ వదలడం లేదు.
బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసుపై ఇప్పటికే సీబీఐ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ సినీనటి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి ( Vijayashanti ) తన సోషల్ మీడియా ద్వారా ఈ కేసుపై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ( Road Accident ) లో ద్విచక్రవాహనదారుడు.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ ( Andhra Pradesh ) లో అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jaganmohan Reddy) శ్రీశైలం పర్యటనను రద్దు చేసుకున్నారు. శ్రీశైలం తెలంగాణ ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం ( Srisailam Fire Accident ) దృష్ట్యా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు.
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెలంగాణ ఎడమగట్టు భూగర్భ విద్యుత్ జల కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన నాలుగో యూనిట్ టెర్మినల్లో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా నిలిచిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చేనెల చివరి నాటికి గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు ( Grama/Ward Sachivalayam Recruitment) పూర్తిచేయనున్నట్లు బుధవారం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి నానాటికీ విజృంభిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి రాజకీయనేతలు, ప్రజాప్రతినిధులు వారి కుటుంబసభ్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు.
ఆయన సినిమాల్లో విలన్ అయినప్పటికీ.. ఇప్పుడు అందరికీ హీరోగా మారాడు. కరోనా లాక్డౌన్ సమయంలో లక్షలాది మంది వలస కూలీలు ఇళ్లకు వెళ్లేందుకు, వారికి భోజన వసతులు కల్పించిన ఆపద్భాందవుడు..సోనూసూద్ ( Sonu Sood ) ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసును గెలుచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు ( Heavy rains) కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు మద్యం అక్రమ రవాణా ( Illegal liquor In AP ) ఏమాత్రం ఆగడం లేదు. కొన్ని నెలల నుంచి లాక్షలాది రూపాయల మద్యం బాటిళ్లను ఏపీ పోలీసులు పట్టుకుంటునే ఉన్నారు. అయినప్పటికీ మద్యం అక్రమ రవాణా దర్జాగా కొనసాగుతూనే ఉంది.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా అంతటా పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం (AP Govt) అందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు పరీక్షలను ఇటీవల రద్దుచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.