Gold rates today on 22nd July: బంగారం ధరలు తగ్గాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గురువారం తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు (Gold prices today Hyderabad) విషయానికొస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 390 మేర తగ్గింది.
Gold prices today on 21st July 2021: హైదరాబాద్: బంగారం ధర మళ్ళీ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 మేర పెరిగింది. ఈ పెంపుతో బంగారం ధర రూ.49,370కు చేరింది. హైదరాబాద్తో పాటు విశాఖపట్నం, బెంగుళూరు, తిరువనంతపురంలోనూ బంగారం ధరలు ఇదే తరహాలో పెరుగుదల బాటలో పయణిస్తున్నాయి.
Largest gold mines discovered in Turkey: టర్కీలో భారీ బంగారం నిధి బయటపడింది. ఈ బంగారం నిధిలో మొత్తం 99 టన్నుల బరువకు సమానమైన బంగారం లభ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. టర్కీకి చెందిన మీడియా సంస్థ అనాడోలు ఈ వార్తను ధృవీకరించింది. అప్పుడప్పుడు, అక్కడక్కడ అనుకోకుండా బంగారు నిధులు బయపడుతుంటాయి.
సోమవారం నాడు 10 గ్రాముల బంగారం ధర రూ. 43,788 మార్కుని తాకినప్పటికీ.. మంగళవారం, బుధవారం ధరలు రూ.1000కిపైగా తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారం ధరలు ఇక దొగొస్తాయేమోనని బంగారం ప్రియులు భావించారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా దిగొచ్చినట్టే కనిపించిన బంగారం ధరలు గురువారం మళ్లీ పెరిగాయి.
బంగారం ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం నాడు బంగారం ధరలు పెరిగింది కేవలం ఒక్క శాతమే అయినా... తాజా పెంపుతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో తాజా పరిణామాలతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధపూరిత వాతావరణం భారత్లో బంగారం, పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మిలిటరీ కమాండర్ ఖాసీం సులేమాన్ మృతికి ప్రతీకారం తీర్చుకుంటూ ఇరాక్లోని అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడిన రోజే బంగారం ధరలకు మరింత రెక్కలొచ్చాయి.
గత రెండు వారాలుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరల్లో మంగళవారం నాడు స్వల్ప తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ క్షీణించడమే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గడానికి ఓ కారణమయ్యాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న గురువారం రూ.150 పెరిగి రూ.32,000 వద్ద ట్రేడ్ అయిన తులం బంగారం ఇవాళ రూ.230 పెరిగి రూ.32,230కి చేరింది. దేశంలో జువెలరీ వ్యాపారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటమే ఈ ధరల పెంపునకు కారణమైందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. బులియన్ మార్కెట్లో నిన్న గురువారం రూ.130 తగ్గి రూ.37,750 పలికిన కిలో వెండి ఇవాళ రూ.250 పెరిగి రూ.38,000లకు చేరుకుంది. నాణేల తయారీదారులతోపాటు పరిశ్రమవర్గాల నుంచి డిమాండ్ పెరగడమే వెండి ధర పెరగడానికి కారణమైందని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి.
బంగారం ధర భారీ స్థాయిలో పడిపోయింది. గ్రాముకు రూ. 405 తగ్గి..10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 31,965 వరకు చేరింది. దేశీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో పాటు అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు లేకపోవడంతో బంగారం ధర పడిపోయినట్లు తెలిసింది.మరో వైపు వెండి కూడా బంగారాన్ని అనుసరించింది. అది కూడా అమాంతంగా తగ్గిపోయి... కిలో వెండి ధర. 370కి తగ్గి 40,830 కి చేరుకుంది. బంగారం ధర తగ్గుముఖం పట్టడంతో జ్యూవెలరీ షాపులకు మగువలు క్యూ కడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.