శ్రీకాకుళం జిల్లాలో పవన్ కల్యాణ్ జన పోరాట యాత్ర కొనసాగుతోంది. రెండో రోజు ఆయన సోంపేట, పలాస ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సోంపేట బీల భూములను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సోంపేట బీల సమస్యను పరిష్కరించే వరకు జనసేన పార్టీ పోరాడుతుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
శ్రీరెడ్డి తనపై అశ్లీల వ్యాఖ్యలు చేశాక.. పవన్ కళ్యాణ్ పలు మీడియా ఛానళ్లపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. వాటిపై ఘాటుగా స్పందిస్తూ.. ఆయన పలు పోస్టులను ట్విట్టర్లో కూడా పంచుకున్నారు. ఆ తర్వాత పలు జర్నలిస్టు సంఘాలు పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతూ.. కేసులు కూడా నమోదు చేశాయి.
జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం హైదరాబాదులోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ మాటలు అన్నారు
కామన్వెల్త్ క్రీడల్లో గుంటూరు జిల్లాకి చెందిన వెయిట్లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ 84 కేజీల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న సంగతి తెలిసిందే.
జనసేన పార్టీ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ముమ్మరం చేస్తోంది. ఇప్పటి వరకు ఈ పార్టీలో 17 లక్షల మంది సభ్యులు చేరారని అంచనా. తాజాగా మరింతమంది సభ్యులను చేర్చుకోవడం కోసం యాప్ను అధికారికంగా ప్రారంభించారు.
ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి తనకు ఒక విషయమైతే కచ్చితంగా అవగతమైందని.. అమిత్ షా లేఖలో రాసిన అంశాలను బట్టి.. దానికి ప్రతిగా చంద్రబాబు చెప్పిన
సమాధానాలు బట్టి చూస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే సూచనలు కనిపించడం లేదని అర్థమవుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఊసరవెళ్లి బొమ్మ పెట్టి.. వివిధ సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలను చూపెడుతూ ఫేస్బుక్లో షేర్ అవుతున్న ఓ పోస్టును నిన్నే క్రిటిక్ కత్తి మహేష్ తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.