Revanth Reddy Orders To Loan Waiver And Grain Purchase: చెప్పినట్టే ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పరిపాలనపై దృష్టి సారించారు. రుణమాఫీతోపాటు ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
Revanth Reddy: లోక్సభ ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి అందుకనుగుణంగా చర్యలు చేపట్టారు. పంద్రాగస్టు 15వ తేదీ వరకు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ దీనికోసం రైతుల రుణాల వివరాలు ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రుణమాఫీపై కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు రుణమాఫీ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు చేయకపోవడంపై తీవ్ర రాజకీయ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ రుణమాఫీపై బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తూ కాంగ్రెస్కు ఓటేయొద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రచారం చేస్తోంది.
Minister Tummala On Rythu Bandhu and Loan Waiver: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుబంధు నగదు జమ.. రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ నిధులన్నీ ఒకేసారి జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. ఈ నెలాఖరులోపే వాటి ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
Crop Loan Waiver: రుణమాఫీపై మరోసారి తెలంగాణ సర్కార్ సైలెంట్ అయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతాంగానికి ఈసారి కూడా తీపి కబురు రాలేదు. ఇప్పటి వరకు కేవలం 35 వేల వరకు రుణం ఉన్నవారికి మాత్రమే మాఫీ అయింది.
నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో జరిగిన "నియంత్రిత సాగు" విధానంపై నల్గొండ నియోజకవర్గస్థాయి కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ( Minister Jagadish Reddy ) , టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిల ( TPCC chief MP Uttamkumar Reddy ) మధ్య అనుకోకుండా మొదలైన మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.