Delta Plus Variant: కరోనా సెకెండ్ వేవ్ సద్దు మణుగుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్ భయపెడుతోంది. కరోనా థర్డ్వేవ్ ముప్పు ముంచుకొస్తోంది. అందుకే ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. రేపట్నించి మరోసారి కఠిన ఆంక్షల్ని అమలు చేయనుంది.
PK and Sarad Pawar: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి వార్తల్లోకెక్కారు. సీనియర్ రాజకీయ నాయకుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీనే దీనికి కారణం. ఇంతకీ ఈ ఇద్దరి భేటీ వెనుక కారణమేంటి, ఏ విషయాలపై చర్చ సాగిందనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Pune fire incident death toll: పూణెలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరుకుంది. సోమవారం రాత్రి వరకు ఫ్యాక్టరీలో సెర్చ్ ఆపరేషన్ (Search operation) నిర్వహించిన పోలీసులు, అగ్నిమాపక దళాలు పరిశ్రమలోంచి 18 మృత దేహాలు వెలికితీశారు.
Maharashtra: సీరమ్ ఇనిస్టిట్యూట్ అధినేత అదార్ పూణావాలా లండన్ ఎందుకు వెళ్లారు..ఎవరు ఆయన్ని బెదిరించారు..కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు సఖ్యత లేదా..మహారాష్ట్ర మంత్రి ఏం చెబుతున్నారో వినండి మరి..
Covid-19 free village competitions: ప్రస్తుతం కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా దేశంలో కోవిడ్-19 కారణంగా తీవ్రంగా నష్టపోతున్న ఓ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైన పోటీలను ప్రకటించింది. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన గ్రామాలకు భారీగా నగదు బహుమతి అందించనుంది
Corona Third Wave: దేశంలో కరోనా థర్డ్వేవ్ హెచ్చరికలు భయం రేపుతున్నాయి. మహారాష్ట్రలో అప్పుడే థర్డ్వేవ్ ప్రారంభమైందా అనే సంకేతాలు వెలువడుతున్నాయి. అంతమంది చిన్నారులకు కరోనా సోకడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముంబై: మహారాష్ట్రలో మొత్తం 2,245 బ్లాక్ ఫంగస్ కేసులు (black fungus cases) గుర్తించినట్టు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె తెలిపారు. ఇప్పటికే కరోనా వైరస్తో (Coronavirus) కష్టాలపాలవుతున్న మహారాష్ట్రలో తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరిగిపోతుండటం అక్కడి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో కీలకమైన అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్స్ (Amphotericin-B injection) సరఫరాకు సంబంధించిన వివరాలు కూడా మహారాష్ట్ర సర్కారు వెల్లడించింది.
Black Fungus in Maharashtra: కరోనా మహమ్మారి నుంచి కోలుకోకముందే బ్లాక్ ఫంగస్ దాడి తీవ్రమౌతోంది. మ్యూకోర్ మైకోసిస్ ప్రాణాంతకంగా మారింది. మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ ఉధృతి తీవ్రంగా ఉంది. రోగుల ప్రాణాలు గాలిలో కల్సిపోతున్నాయి.
Maharashtra: లాక్డౌన్ ఆ రాష్ట్రంలో ఆశించిన ప్రయోజనాల్ని చేకూరుస్తోంది. అందుకే మరికొద్ది రోజులు లాక్డౌన్ పొడిగింపుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మే 31 వ తేదీ వరకూ లాక్డౌన్ పొడిగించారు.
India Corona Update: దేశంలో కరోనా మహమ్మారి కట్టడి కావడం లేదు. చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ అమల్లో ఉన్నా సరే కేసుల సంఖ్య మాత్రం భారీగా పెరుగుతోంది. దేశంలో వరుసగా మూడవరోజు కూడా ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
No Stock Of COVID-19 Vaccine | కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరూ కోవిడ్19 టీకాలు తీసుకునేందుకు అర్హులు అని ప్రకటించడం తెలిసిందే. తాము మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించలేమని నాలుగు రాష్ట్రాలు ప్రకటించాయి.
Maharashtra fire accident: మహారాష్ట్రలో మరో ఘోరం జరిగిపోయింది. కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ఏకంగా 14 మంది సజీవ దహనమయ్యారు. కొంతమంది ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Lockdown again: దేశంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తోంది. మహారాష్ట్ర తరువాత అత్యధికంగా కరోనా కేసులు కర్నాటకలో నమోదవుతున్నాయి. ప్రజలు మాట వినకపోతే లాక్డౌన్ విధించాల్సి వస్తుందనే హెచ్చరికలు చేస్తోంది ప్రభుత్వం.
Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ మరోమారు కల్లోలం సృష్టిస్తుండడంతో లాక్డౌన్పై సమాలోచనలు చేస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం.
Telangana: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితిని మంత్రి ఈటెల రాజేందర్ సమీక్షించారు. అదనంగా నాలుగు కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
Maharashtra: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా మారింది. కేవలం 24 గంటల వ్యవధిలో 50 వేల కేసులు నమోదవడం పరిస్థితి ప్రమాదాన్ని సూచిస్తోంది. అప్రమత్తమైన ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తోంది.
Covid19 Update: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నట్టే..ఆంధ్రప్రదేశ్లో సైతం కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షల్ని మరోసారి ముమ్మరం చేస్తున్నారు.
Covid19 Virus: దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు కొత్తగా మరణాల సంఖ్య కూడా పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.