దేశమంతా ఎదురుచూస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఒకేసారి ప్రారంభం కానుంది. దేశమంతా ఒకేసారి ప్రారంభించేందుకు వీలుగా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు రైల్వే బోర్డు ప్రకటించింది.
దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ( Congress ) బలహీనపడిందని.. యూపీఏ చైర్మన్గా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) నియమితులైతే తమకు సంతోషమేనని శివసేన ప్రకటించింది.
షిర్డీలోకి ప్రవేశించకుండా సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ ( Trupti Desai ) పై తాత్కాలిక నిషేధం విధించారు. మహారాష్ట్రలోని ఈ షిర్డీ పరిధిలోకి ఈనెల 8 నుంచి 11న అర్ధరాత్రి వరకు ప్రవేశించరాదంటూ షిర్డీ ఏరియా సబ్-డివిజనల్ కార్యాలయం ( Shirdi Sub Divisional Office ) మంగళవారం అర్ధరాత్రి ఆదేశాలు జారీ చేసింది.
బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ (Urmila Matondkar) మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన ( Shiv Sena ) లో చేరారు. మంగళవారం మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray ) సమక్షంలో ముంబైలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
కరోనా మహమ్మారి ఇటీవల కాలంలో చాలా మంది ప్రముఖులను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా మహారాష్ట్ర (Maharashtra) లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ఎమ్మెల్యే భరత్ భాల్కే (Bharat Bhalke ) శనివారం కన్నుమూశారు.
బాలీవుడ్ (Bollywood)కు చెందిన మరో నటుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. బాలీవుడ్లో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న ఆసిఫ్ బస్రా (53) (Asif Basra) ఆత్మహత్య చేసుకున్నారు.
Maharashtra Covid-19 Death Toll | వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. ఆదివారం విడుల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. మహారాష్ట్రలో తాజాగా 5,369 పాజిటివ్ కేసులు, 113 మరణాలు నమోదయ్యాయి. ముంబైలో కరోనా మరణాల సంఖ్య 10,318కి చేరింది.
బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్ (Urmila Matondkar) పేరు మహారాష్ట్ర శాసన మండలికి దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్కు నటి ఊర్మిళ పేరును మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra government ) నామినేట్ చేయనుంది.
Fire Accident In Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిటీ సెంటర్ మాల్లో గురువారం రాత్రి దాదాపు 9 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం సైతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నట్లు సమాచారం
మహారాష్ట్ర ( Maharashtra) లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడటంతో (bus Accident) ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. 35 మంది గాయాలపాలయ్యారు.
భారీ వర్షాలతో దేశంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే అతలాకుతలం అవుతున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, పూనే, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ (IMD) దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis), శివసేన కీలక నేత, ఎంపీ, సంజయ్ రౌత్ ( Sanjay Raut ) శనివారం ముంబైలోని ఓ లగ్జరీ హోటల్లో భేటీ అయ్యారన్న విషయం తెలియగానే రాజకీయ వర్గాల్లో అలజడి మొదలైంది. బీజేపీతో బంధం తెగిపోయిన నాటినుంచి ఎప్పుడూ శివసేన బీజేపీపై విరుచుకుపడుతూనే ఉంది. అయితే వారిద్దరి భేటీపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మరణాల సంఖ్య (Bhiwandi building collapse Death toll) 41కి చేరుకుంది. మూడు రోజులపాటు కొనసాగించిన సహాయక చర్యలను నాలుగోరోజైన గురువారం నిలిపివేశారు.
మహారాష్ట్రలో జరిగిన భవనం కుప్పకూలిన ఘటనలో మరణాల సంఖ్య (Death Toll Rises in Bhiwandi Building Collapse) పెరిగిపోతోంది. ఇప్పటివరకూ భీవండి భవనం కుప్పకూలిన ఘటనలో 35 మంది మరణించారని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెబుతున్నారు.
మహారాష్ట్ర (Maharashtra) లోని థానే భీవండి పట్టణం (Bhiwandi ) లో సోమవారం తెల్లవారుజామున మూడంతస్థుల భవనం కుప్పకూలి ( building collapses ) ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.