Telangana New Secretariat Building: ఇటీవల సీఎం కేసీఆర్ కూడా సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులు, మంత్రి వేములకు పలు సూచనలు చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు, సూచనలు నిర్మాణంలో పాటిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని వేముల ప్రశాంత్రెడ్డి అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Teenmar Mallanna Political Plans: తీన్మార్ మల్లన్న తీరు మారిందా ? ప్రభుత్వ యంత్రాంగం అవలంబిస్తున్న విధానాలపైన, మంత్రులు, ఉన్నతాధికారుల వేధింపులపైనా, బాధితుల తరపున సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో గళమెత్తిన తీన్మార్ మల్లన్న ఇటీవల కాలంలో తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలు తీవ్ర చర్చనియాంశమవుతున్నాయి.
Telangana CS Somesh Kumar: తెలంగాణలో రాజకీయాలు నాయకుల చుట్టే కాదు... ఉన్నతాధికారుల చుట్టూ కూడా తిరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ టీంపై చర్చించిన వారు... నేడు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ గురించి చెప్పుకుంటున్నారు.
Swagruha Flats for Sale : తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బండ్లగూడ, పోచారం స్వగృహ ఫ్లాట్ల అమ్మకంపై సంబంధిత అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఫ్లాట్ల విక్రయ విధివిధానాల తుది రూప కల్పనపై అధికారులతో చర్చించారు.
Dharani Portal: ధరణి పోర్టల్ లోని లోపాలను తెలంగాణ అధికారులకు ఎట్టకేలకు సరి చేశారు. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ధరణిలో ఓ కొత్త మాడ్యూల్ను చేర్చారు.
2021-22 Academic Year: నిన్నటితో 2021-22 విద్యాసంవత్సరానికి ముగింపు వచ్చింది. సుమారు 18 నెలల విరామం తర్వాత పాఠశాలలు ఎటువంటి కరోనా ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ఈ సంవత్సరాన్ని ముగించాయి.
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో ఇప్పటివరకు అమలులో ఉన్న 111 జీవోను ఎత్తివేసింది. 111 జీవో తొలగించడంతో ఆ 84 గ్రామాల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ సర్కార్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. అయితే 111 జీవో ఎత్తివేతపై పర్యావరణ వేత్తలు, హైదరాబాద్ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
CM KCR meeting with TRS MLAs, MLCs: ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం అదే రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్ళ మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్ సభలో, రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు.
Telangana budget sessions 2022: అసెంబ్లీ వేదికగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామన్నారు. వీరితో పాటు సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. సర్ఫ్, మెప్మా ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.