తెలంగాణలో కరోనా కాటుకు మరో ఇద్దరు మృతి

తెలంగాణలో సోమవారం ఇద్దరు కరోనావైరస్ పాజిటివ్ రోగులు చనిపోగా కొత్తగా 14 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. సోమవారం గుర్తించిన కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 872కి చేరింది.

Last Updated : Apr 21, 2020, 06:10 AM IST
తెలంగాణలో కరోనా కాటుకు మరో ఇద్దరు మృతి

హైదరాబాద్: తెలంగాణలో సోమవారం ఇద్దరు కరోనావైరస్ పాజిటివ్ రోగులు చనిపోగా కొత్తగా 14 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. సోమవారం గుర్తించిన కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 872కి చేరింది. అందులో ప్రస్తుతం 663 మంది రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నేటివరకు రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 23కి చేరింది. ఇప్పటివరకు కరోనా వైరస్‌‌ నుంచి 186 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

Also read : ఏపీలో కొత్తగా మరో 75 క‌రోనా కేసులు

నేడు గుర్తించిన కేసులలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 12, మేడ్చల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News