ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలుతో కూడిన వర్షం కురుస్తోంది. నిత్యం రద్దీ ఉండే కోఠి, అబిడ్స్, మలక్పేట, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలదిగ్భంధంలో ఉన్నాయి.
హైదరాబాద్లో ప్రస్తుతం వాతావరణం ఏమీ బాగాలేదు. దట్టమైన మేఘాలు కమ్ముకొని అంతా చీకటిగా మారిపోయింది. ఇప్పటికే తెలంగాణలో భారీ వర్షాలు కురవగా.. వాటి ప్రభావం భాగ్యనగరం మీద కూడా పడింది. నగరంలో పడ్డ వర్షం వల్ల నానా బీభత్సం జరిగింది.
చెన్నైలో వర్ష బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదు రోజులుగా ఎడతెరిపికుండా కురుస్తున్న వర్షాలకు చెన్నై నగరం తడిసిముద్దయింది. కురుస్తున్న వర్షాల కారణంగా తమిళనాడులోని ఆరు జిల్లాల్లో సుమారు 10 లక్షలకు పైగా ఇళ్లు నీట మునిగాయి, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా వర్ష తీవ్రత అధికమవుతోంది. చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, కడలూరు, తిరువారూర్, నాగపట్టణం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిల్లో వర్షం అధికంగా పడుతోంది.
భారీ వర్షం..భాగ్యనగరాన్ని ముంచేసింది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. చిన్నగా మొదలైన వాన తీవ్రరూపం దాల్చింది. దీంతో హైదరాబాద్ నగరంలో జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాపూర్తిగా నిలిచిపోయింది. నగరంలో ఎక్కడ చూసినా రోడ్లపై నీరు చేరింది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల చెట్లు, విద్యస్తంభాలు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
భారీ వర్షానికి చిన్నారి సహా ముగ్గురు బలి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.