తెలంగాణ రాజధాని హైదరాబాద్ను జలప్రళయం మరోసారి ముంచెత్తింది. రెండు రోజుల క్రితం భారీ వర్షాలతో అతలాకుతలమయిన నగరాన్ని భారీ వర్షంతో వరదలు చుట్టుముట్టాయి. ఎటుచూసినా నీరే కనిపిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి.
Hyderabad Rains: వరుణుడి ప్రకోపానికి భాగ్యనగరం ( Hyderabad ) అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాల తరువాత వచ్చిన వరదల వల్ల జనజీవనం అస్థవ్యస్తం అయింది. చాలా చోట్ల నిన్నా మొన్నటి పరిస్థితే కనిపిస్తోంది. వీధుల్లోకి వచ్చి చేరిన నీరు ఇంకడానికి చోటు లేక అనేక చోట్ల నిలిచిపోయింది.
CM KCR relief kit: హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలతో వరదలు పోటెత్తిన అనంతరం చేపట్టిన సహాయ కార్యక్రమాలపై నేడు జిహెచ్ఎంసి ( GHMC ) ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్తో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ( Minister KTR ) ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణ (Telangana ) రాష్ట్రం అతలాకుతలమైంది. భారీ వర్షాల ( heavy rains ) తో భాగ్యనగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ మేరకు సాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi) కి గురువారం లేఖ రాశారు.
ఓ వైపు భారీ వర్షాల్నించి తేరుకోకముందే హైదరాబాద్ వాసులకు మరో భయం వెంటాడింది. తాజాగా గచ్చిబౌలిలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భయపడిన జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
భారీ వర్షాలతో దేశంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే అతలాకుతలం అవుతున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, పూనే, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ (IMD) దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad Rains) పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగిఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలతో హైదరాబాద్ నగరం భారీగా నష్టపోయింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం మొత్తం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎటుచూసినా నీరే కనిపిస్తుండంటంతో భాగ్యనగరవాసులు భయాందోళన చెందుతున్నారు. ఇదిలాఉంటే.. భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య తాజాగా 15 కు చేరింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( heavy rains) నగరం మొత్తం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు వచ్చిచేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య తాజాగా 11కు చేరింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమైంది. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం జలమయమయింది. రహదారులు, కాలనీలన్నీ వరద నీటితో దర్శనమిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చిచేరింది.
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో పాతబస్తీ చాంద్రాయణగుట్ట పరిధి గౌస్నగర్ బండ్లగూడ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
deep depression in bay of bengal | వాయుగుండం తీరం దాటడంతో దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచించారు.
Heavy rain in Hyderabad: హైదరాబాద్కి భారీ వర్షసూచన ఉన్నట్టు జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం నగరంలో రాబోయే 72 గంటల పాటు భారీ వర్షాలు ( Heavy rainfall) కురిసే అవకాశం ఉందని చెప్పిన ఆయన.. కొన్ని చోట్ల 9 నుండి 16 సెంటిమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు.
తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లో రాబోయే రెండు రోజులు.. సోమవారం, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ మేరకు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాల (Heavy rains) ముప్పు పొంచి ఉంది. తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంతో రోబోయే నాలుగురోజుల్లో ఇరురాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ (TS) లో రెండు రోజులుగాఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) నీటిమట్టం 16.2అడుగులకు చేరింది. బ్యారేజీకి వరద నీరు భారీగా వస్తుండటంతో.. అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు.
భారీ వర్షాలు తెలంగాణను ( Telangana ) ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అటు ఆంధ్రప్రదేశ్ ( AP ) లోనూ పరిస్థితి అలాగే ఉంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తూనే ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ (Hyderabad)లో కుండపోత వర్షం కురిసింది. దీంతో నగర రోడ్లన్నీ జలశయాలను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ (GHMC) లోని పలుచోట్ల ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఎటుచూసినా.. వరదనీరే కనిపిస్తుండటంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు.
ఏపీలో మరో మూడ్రోజులపాటు వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఇంకా కొనసాగుతున్న నేపధ్యంలో తేలికిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.