Heavy rain in Hyderabad: హైదరాబాద్కి భారీ వర్షసూచన ఉన్నట్టు జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం నగరంలో రాబోయే 72 గంటల పాటు భారీ వర్షాలు ( Heavy rainfall) కురిసే అవకాశం ఉందని చెప్పిన ఆయన.. కొన్ని చోట్ల 9 నుండి 16 సెంటిమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు.
తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లో రాబోయే రెండు రోజులు.. సోమవారం, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ మేరకు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాల (Heavy rains) ముప్పు పొంచి ఉంది. తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంతో రోబోయే నాలుగురోజుల్లో ఇరురాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ (TS) లో రెండు రోజులుగాఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) నీటిమట్టం 16.2అడుగులకు చేరింది. బ్యారేజీకి వరద నీరు భారీగా వస్తుండటంతో.. అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు.
భారీ వర్షాలు తెలంగాణను ( Telangana ) ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అటు ఆంధ్రప్రదేశ్ ( AP ) లోనూ పరిస్థితి అలాగే ఉంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తూనే ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ (Hyderabad)లో కుండపోత వర్షం కురిసింది. దీంతో నగర రోడ్లన్నీ జలశయాలను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ (GHMC) లోని పలుచోట్ల ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఎటుచూసినా.. వరదనీరే కనిపిస్తుండటంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు.
ఏపీలో మరో మూడ్రోజులపాటు వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఇంకా కొనసాగుతున్న నేపధ్యంలో తేలికిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగి ప్రకాశం బ్యారేజీకి ( Prakasam Barrage ) వరద నీరు పోటెత్తుతున్నందున విజయవాడ ( Vijayawada ) నగరవాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని విజయవాడ మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ( Prasanna Venkatesh ) సూచించారు.
తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( Heavy rain ) నదులు, వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాల్లోకి వరద నీరు ఉప్పొంగుతుండటంతో అనేక జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి.
వరద ప్రభావిత గోదావరి జిల్లాల్లో ( Flood effected Godavari districts ) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. అటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరద పరిస్థితుల్ని సమీక్షించారు. ముంపు బాధిత ఇళ్లకు తక్షణ సహాయం కింద రెండు వేల రూపాయలు అందించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లోని భారీవర్షాలు ( Heavy rains ), వరద ( Floods ) పరిస్థితులపై ప్రతిపక్షనేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తక్షణం సహాయక చర్యలు తీసుకోవల్సిందిగా సీఎం జగన్ ను కోరారు.
గోదావరి నది ( Godavari river ) మహోగ్రరూపం దాల్చేస్తోంది. భారీగా వచ్చి చేరుతున్న వరదతో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ ( Dowlaiswaram Barriage ) వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నుంచి 19 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలో వదులుతున్నారు.
గోదావరి వరద ( Godavari flood ) పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని..లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు.
గోదావరి వరద ( Godavari Flood ) ఉధృతి మరింతగా పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఉగ్రరూపం దాలుస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ ( Dowlaiswaram barriage ) వద్ద రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి నది..మరింత పెరగవచ్చని తెలుస్తోంది.
గత రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు (Heavy Rains In Telangana) తప్పవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే మూడ్రోజుల్నించి వర్షాలతో తడిసిముద్దయిన ఏపీకు ..మరో మూడ్రోజులు వర్షాలు తప్పేట్లు లేవు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ( Heavy rains 0 పడవచ్చని తెలుస్తోంది.
గోదావరి ( Godavari ) నదీ పరివాహక ( River catchment area )ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో నదీ ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. రాజమండ్రి ( Rajahmundry ) ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ విడుదల చేసారు. నదీ ప్రవాహం మరింతగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ( Delhi CM Arvind Kejriwal ) బీజేపి ఎంపీ గౌతం గంభీర్ ఘాటు ( BJP MP Gautam Gambhir ) వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు చెరువులను తలపించేలా వరద నీటితో నిండిపోయాయి.
బంగాళాఖాతంలో ( Bay of bengal ) ఏర్పడిన అల్పపీడన ( Depression ) ప్రభావంతో ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు ( heavy rains ) కురిసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.