దేశ ఆర్ధిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అల్లాడుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా వణికిన ముంబై నగరం ఇప్పుడు వరద ముప్పెట చిక్కుకుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ద్రోణి కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి..
తెలంగాణలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు (Heavy Rains In Telangana) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడ్రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Telugu States : తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ( Heavy Rains ) కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాపాతం నమోదు అయ్యింది. అయితే మరికొన్ని రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు ( Heavy rains) కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలమవుతోంది. భారీ వర్షాల కారణంగా వాగులు , వంకలు పొంగిపొర్లడంతో వంతెనలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి.హిమాచల్ ప్రదేశ్ లో కొండ చరియలు విరిగిపడుతున్న వీడియో వైరల్ అవుతోంది.
ఈ దృశ్యం చిన్నదే కావచ్చు. కానీ భయం గొలుపుతోంది. ఈ వీడియో ఒక్కటి చాలు ఒళ్లు గగుర్పాటుకు లోనవడానికి. కేరళ ( Kerala ) లోని ఓ గ్రామాన్ని సముద్రం నీరు ముంచెత్తుతున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Heavy Rains In Delhi | ఢిల్లీతో సహా దేశ రాజధాని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రవాణాకు అడ్డంకులు తలెత్తుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Weather updates: హైదరాబాద్: తెలంగాణలో శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షపాతం ( Heavy rainfall ) నమోదైంది.
lightning strikes | ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు బిహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, పిడుగుపాటుల కారణంగా మరణించిన వారి సంఖ్య 115కి చేరింది. దీంతో ప్రభుత్వం పదిజిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు
Bihar rains: పాట్నా: బీహార్లో ఉరుమురులు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీహార్లో కురుస్తున్న భారీ వర్షాలతో ( Rains in Bihar) పాటు పిడుగుపాటు కారణంగా ఒక్క రోజే 83 మంది మృతి చెందారు. బీహార్లో కురుస్తున్న భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత 24 గంటల్లోనే సుమారు 83 మంది మృతి చెందారంటే.. అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించవచ్చు.
Weather forecast | అమరావతి: నైరుతి రుతుపవనాల (Monsoon ) ప్రభావంతో ఇప్పటికే తడిసి ముద్దవుతున్న కోస్తాంధ్రకు తాజాగా మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు ( Heavy rains ) పొంచి ఉన్నాయి. బంగాళాఖాతంపై ఒడిషా తీరంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనంతో పాటు ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Weather updates | విశాఖ: తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో 24 గంటల్లో ఆ అల్పపీడనం మరింత బలపడనున్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Monsoon rains | అమరావతి: రైతులకు గుడ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి ( Monsoon hits AP). జూన్ 7 నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ (IMD) ఊహించినట్టుగానే జూన్ 6న రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. కేరళ, కర్ణాటక రాష్ట్రాలను దాటుకుని చిత్తూరు, అనంతపురం జిల్లాల ద్వారా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
Cyclone Nisarga live updates నిసర్గ తుఫాన్ తీరాన్ని తాకింది. వాతావరణ శాఖ ( (IMD ) అంచనా వేసినట్టుగానే ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ 2.30 గంటల వరకు కొనసాగింది. అలీబాగ్కి సమీపంలో తుఫాన్ తీరాన్ని తాకింది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో అరేబియా సముద్రం ( Arabia sea ) అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలజడితో తీర ప్రాంతాల్లో పలు చోట్ల అలలు 15-20 అడుగుల ఎత్తువరకు ఎగిసిపడుతున్నాయి.
Cyclone Nisarga నిసర్గ తుఫాను రేపు బుధవారం తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ( IMD ) హెచ్చరించింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అలజడి సృష్టిస్తున్న నిసర్గ తుఫాన్ ( Cyclone Nisarga in Arabia sea ).. ముంబైకి 430 కిమీ దూరంలో, మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది (Cyclone Nisarga may landafll ).
అప్పటివరకు తీవ్ర ఎండలు.. వేడెక్కన వాతారణం నగరంలో ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో రానున్న 24గంటల్లో తెలంగాణలో
నగర శివార్లతో పాటు రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల శనివారం సాయంత్రం భారీ వర్షం ( Heavy rain ) కురిసింది. ముఖ్యంగా మహేశ్వరం మండలంలోని గ్రామాలతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
బుధవారం సాయంత్రం కురిసిన అకాల వడగండ్ల వానకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు) మండలాలు చిగురుటాకులా వణికిపోయాయి. కెరమెరి మండలంలోని మహరాజ్గూడ, బాబేఝరి, పాటగూడ, శివగూడ పరిసర ప్రాంతాల్లో గంట పాటు ఏకధాటిగా కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.
తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాతావరణం మార్పు ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ శివార్లలోని పలు ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లా, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.