Hyderabad Protests Against Raja Singh: హైదరాబాద్ పాతబస్తీలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. పాతబస్తీలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు విధించారు. ముఖ్యంగా చార్మినార్, శాలిబండ, హుస్సేనీ ఆలం వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు మరింత పెంచారు.
AP Rains: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. రుతు పవనాలు, ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో విపత్తుల సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Heavy rain in Hyderabad: హైదరాబాద్కి భారీ వర్షసూచన ఉన్నట్టు జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం నగరంలో రాబోయే 72 గంటల పాటు భారీ వర్షాలు ( Heavy rainfall) కురిసే అవకాశం ఉందని చెప్పిన ఆయన.. కొన్ని చోట్ల 9 నుండి 16 సెంటిమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు.
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్ముకశ్మీర్తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఏడు రాష్ట్రాల్లో పుల్వామా తరహా దాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్కి చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందని నిఘావర్గాల హెచ్చరించాయి.
పాకిస్తాన్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున జమ్ము కాశ్మీరు ప్రాంతంలోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్కి సమాచారం అందింది. ఈ క్రమంలో కాశ్మీరు పరిసర ప్రాంతాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా భద్రతను పటిష్టం చేయబోతున్నారు. ముఖ్యంగా దేశ రాజధానిలో పెద్ద ఎత్తున భద్రతా దళాలు కాపుగాయనున్నాయి.
తమిళనాడు రాష్ట్రం అంతటా హైఅలర్ట్ ప్రకటించారు. డీఎంకే చీఫ్ కరుణానిధి ఆరోగ్యముపై వస్తున్న వదంతుల నేపథ్యములో డీజీపీ రాజేంద్రన్ అన్ని జిల్లా ఎస్పీ లకు హైఅలర్ట్ ఆదేశాలు జారీ చేశారు. సెలవుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది, అధికారులు బందోబస్తు విధులకు తప్పనిసరిగా హాజరవ్వాలని ఆదేశించారు. గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై చేరుకోవడంతో అసలు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ తమిళనాట నెలకొంది. ఇదే విషయాన్ని పోలీసులకు అడిగితే రెగ్యులర్ గా ఉండే డ్యూటీయే అని చెప్పుకొచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.