Heavy Rains in Telangana: కుండపోత వర్షాలకు తెలంగాణ అతలాకుతలం అవుతోంది. ఈ వానలు రాజధాని హైదరాబాద్ తో పాటు నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి.
Good news to VRAs, VRAs are now Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవలే కాలం చెల్లిన వీఆర్వో వ్యవస్థను రద్దు చేసుకున్నామని, రైతుల కల్లాల కాడ ఇచ్చింది తీసుకుంటూ.. గ్రామ సేవ చేసిన నాటి భూస్వామ్య కాలపు అవశేషమైన వీఆర్ఏ వృత్తి విధానాన్ని రద్దు చేసుకొన్నామన్నారు. వారికి పే స్కేలు కల్పించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేశామని సీఎం అన్నారు.
తెలంగాణను వరుణుడు వీడడం లేదు. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Heavy Rains in Telangana: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో అల్పపీడన ప్రదేశ ఏర్పడనుందని.. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో వర్షాలకు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Heavy Rains: తెలంగాణకు మరో నాలుగు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే గత నాలుగేైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జలాశయాలు నిండుకున్నాయి. ఎక్కడా ఎలాంటి ఆస్థి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Telangana Rains: ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే వాతావరణ శాఖ ఈ రోజు పిడుగులాంటి వార్తను వెల్లడించింది.
Telangana Rains Updates: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం నలుమూలలా ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా ఎక్కడిక్కడ ఇరిగేషన్ అధికారులు రిజర్వాయర్ల గేట్లు నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఏయే జిల్లాల్లో వరదల పరిస్థితి ఎలా ఉందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Heavy Rains In Hyderabad for Today and Tomorrow: జంట జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో జలాశయాల దిగువ ప్రాంతాల్లోని నది పరివాహక ప్రాంతాల్లో వరద తాడికి పెరిగే అవకాశం ఉందని జలమండలి ఎండి దానకిశోర్ తెలిపారు. సంబంధిత అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని దాన కిషోర్ హెచ్చరికలు జారీచేశారు.
Heavy Rains in Telangana: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కూడా భారీ వర్షాలు ఉన్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ సమీక్ష చేపట్టారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షాల కారణంగా తెలంగాణలో అన్ని విద్య సంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే! వాటి గురించి మరిన్ని విషయాలు..
Food Processing Units In Telangana: తెలంగాణ రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం తెలిపారు. అందులో భాగంగానే ప్రస్థుతం ఉన్న రైస్ మిల్లులు యధా విధిగా కొనసాగుతూనే, అధునాతన మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించే దిశగా కార్యాచరణ చేపడుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు.
AP, Telangana Rains: మహారాష్ట్ర వంటి ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గోదావరిలోకి వరద ఉధృతి స్వల్పంగా పెరుగుతోంది అని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ముందస్తుగా వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రజా రవాణా వ్యవస్థలోని అన్ని సౌకర్యాల్ని వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తోంది. వన్ కార్డు ఆల్ నీడ్స్ వ్యవస్థను తీసుకొస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
KTR's Plan for Revanth Reddy: ఇటీవల తెలంగాణలో ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి మధ్య తీవ్ర స్థాయిలో పెను మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది.
దినాభివృద్ది చెందుతున్న హైదరాబాద్ విశ్వ నగరంగా మారుతుంది. గూగుల్ మొదలుకుని చిన్న చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీల వరకు వందలు కాదు వేలకు వేలు హైదరాబాద్ లో ఉన్నాయి. ఇపుడు కొత్తగా విమానాల ఇంజన్ రిపేర్లు చేసే ఇండస్ట్రీ కూడా హైదరాబాద్ లో పారంభం కానుంది.
Ponguleti Srinivas Reddy About Land Kabja Allegations: తనకు ప్రచార కమిటీ కో చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చిన ఏఐసీసీ, పీసీసీ నేతలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కష్టపడి పనిచేస్తాను అని అన్నారు.
BJP MLAs Raghunandan Rao, Raja Singh to join BRS ?: బీజేపీలో ట్రిపుల్ R గా పేరు తెచ్చుకున్న డైనమిక్ ఎమ్మెల్యేస్ లో వీరు ఇద్దరు పార్టీలో తమ గళాన్ని గట్టిగ వినిపించి ఇప్పుడు ఒక్కసారిగా మౌనం పాటిస్తున్నారు. రఘునందన్ రావు ఒక పదవిపై కన్నువేయడం, రాజసింగ్ నోటి మాటల వలెనే బీజేపీ అధిష్టానం వీరిని పక్కన పెట్టినట్టు సమాచారం. దీనికి వారిలో అసంతృప్తి కారణమా ? సరైన గుర్తింపు లేకపోవడమా ?
కేసీఆర్ పుట్టింది రైతుల కోసం కాదు. రైతులను పాడే ఎక్కించడానికే అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతును రాజును చేసినం అని ప్రగల్భాలు పలికే చిన్న దొరా.. రైతు ఎట్లా రాజయ్యిండో సమాధానం చెప్పాలే అని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించారు.
KTR About Revanth Reddy's Comments on Electricity Supply For Farmers: కాంగ్రెస్ నోట రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది అని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రైతులను ఉద్దేశించి హెచ్చరించారు. మూడు ఎకరాల రైతుకు మూడుపూటలా కరెంట్ ఎందుకు అని వ్యాఖ్యానించడమంటే.. ముమ్మాటికీ అది సన్నకారు రైతులను, చిన్నకారు రైతులను అవమానించడమే అవుతుంది అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.