Benguluru: మహిళతో ఆ పనిచేస్తూ వ్యక్తి మృతి.. భర్త సాయంతో మృతదేహం మాయం

Benguluru Man Death Case: అతనికి పనిమనిషితో వివాహేతర సంబంధం ఉంది. మనువడిని బ్యాడ్మింటన్ క్లాస్‌లో దింపి.. సరాసరి ఆమె ఇంటికి వెళ్లాడు. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో సడెన్‌గా ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ తరువాత ఏం జరిగింది..? అతను ఎలా చనిపోయాడు..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2022, 01:40 PM IST
  • పనిమనిషితో వివాహేతర సంబంధం
  • ఏకాంతంగా ఉన్న సమయంలో గుండెపోటు
  • భర్తసాయంతో మృతదేహాన్ని బయట పాడేసిన మహిళ
Benguluru: మహిళతో ఆ పనిచేస్తూ వ్యక్తి మృతి.. భర్త సాయంతో మృతదేహం మాయం

Benguluru Man Death Case: బెంగళూరులో  సంచలన ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోగా.. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళతో శృంగారంలో చేస్తూ వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో భయపడిపోయిన ఆమె.. తన భర్తతో కలిసి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి బయటపడేసినట్లు తేలింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

నగరంలోని జేపీ నగర్‌కు చెందిన బాలసుబ్రమణ్యం  (67) వ్యాపారవేత్త. తన ఇంట్లో పని చేసే మహిళ (35)తో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నవంబర్ 16న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తన మనవడిని బ్యాడ్మింటన్ క్లాస్‌కు వదిలి పెట్టేందుకు బటయకు వెళ్లాడు. అనంతరం అక్కడి నుంచి పనిమనిషి ఇంటికి చేరుకున్నాడు. ఆ తరువాత కొంచెం ఆలస్యంగా ఇంటికి తిరిగి వస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. అయితే ఆయన అర్థరాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. అనంతరం కుటుంబ సభ్యులు సుబ్రమణ్యనగర్ పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు చేశారు.

పని మనిషి ఇంటికి వెళ్లిన బాలసుబ్రమణ్యం.. ఆమె శృంగారం చేస్తున్న సమయంలో గుండె పోటుతో మృతి చెందాడు. తమ బాగోతం బయటపడిపోతుందని భయపడిపోయిన మహిళ.. వెంటనే భర్తకు, సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ముగ్గురు కలిసి అతని మృతదేహాన్ని ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి రోడ్డు పక్కన పడేశారు.

నవంబర్ 17న గుర్తు తెలియని మృతదేహంపై సమాచారం అందుకున్న పోలీసులు.. విచారించగా ఆ వ్యక్తిని బాలసుబ్రమణ్యంగా గుర్తించారు.  అతని మృతికి గల కారణాలను ఆరా తీయగా.. పని మనిషితో అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. ఆమెను విచారించగా.. అసలు విషయం చెప్పింది. పట్టుబడతామనే భయంతోనే ఇలా చేశామని నిందితులు ఒప్పుకున్నారు. 

పనిమనిషితో శృంగారం చేస్తున్న సమయంలో వృద్ధుడికి ఛాతిలో నొప్పి వచ్చి గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి గతేడాది యాంజియోప్లాస్టీ సర్జరీ జరిగింది. వృద్ధుడు చనిపోవడంతో.. కేసు బయటపెట్టి పట్టుబడుతుందనే భయంతో పనిమనిషి తన భర్త, సోదరుడితో కలిసి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి రోడ్డుపక్కన పడేశారు. విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Also Read: Shradha Murder Case: శ్రద్ధా హత్య కేసులో కీలక అప్‌డేట్.. ఫోరెన్సిక్ ల్యాబ్ ఏం చెప్పిందంటే..!  

Also Read: India Vs New Zealand: టీ20ల్లో సూపర్ హీరో.. మొదటి వన్డేలో విలన్‌గా మారాడు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News